Vikram Kirloskar: గుండెపోటుతో విక్రమ్‌ కిర్లోస్కర్‌ కన్నుమూత

టయోటా కిర్లోస్కర్‌ వైస్‌-ఛైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు టయోటా కిర్లోస్కర్‌ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 30 Nov 2022 10:10 IST

బెంగళూరు: టయోటా కిర్లోస్కర్‌ వైస్‌-ఛైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ (64) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్‌, కూతురు మనాసి కిర్లోస్కర్‌ ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరులోని హెబ్బల్‌ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విక్రమ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. కిర్లోస్కర్‌ గ్రూప్‌లో ఆయన నాలుగో తరానికి చెందినవారు. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌కు వైస్‌-ఛైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు కిర్లోస్కర్‌ సిస్టమ్స్‌కు ఎండీ, ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. సియామ్‌, సీఐఐ, ఏఆర్‌ఏఐలో ఆయన పలు కీలక పదవుల్లో పనిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని