‘విషాద’ యాత్ర.. ముగ్గురు IIT విద్యార్థులు సహా ఏడుగురి దుర్మరణం
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హిమాచల్ప్రదేశ్లోని కుల్లూ జిల్లాలో టెంపో వాహనం లోయలో.....
సిమ్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హిమాచల్ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో టెంపో వాహనం లోయలో పడటంతో ఏడుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు ఐఐటీ వారణాసికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 10మందికి గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో బంజర్ సబ్డివిజన్లోని ఘియాఘిలో చోటుచేసుకున్నట్టు తెలిపారు. దిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్కు చెందిన పలువురు విహార యాత్రకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో పెను విషాదం నింపింది.
ఈ ప్రమాదంలో తొలుత ఐదుగురు పర్యాటకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు వారణాసి ఐఐటీకి చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించిన పోలీసులు.. వారిలో దిల్లీకి చెందిన సౌరభ్, ప్రియాంక గుప్తా, కిరణ్తో పాటు యూపీకి చెందిన రిషబ్ రాజ్, అన్షిక జైన్, ఆదిత్య ఉన్నట్టు కుల్లు ఎస్పీ గురుదేవ్ శర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో హరియాణా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందినవారు ఉన్నట్టు పేర్కొన్నారు. చీకట్లోనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను తొలుత ఆస్పత్రికి తీసుకెళ్లిన స్థానికులు, అధికార యంత్రాంగం.. మెరుగైన చికిత్స కోసం వారిని కుల్లూలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఘటన బాధాకరం.. మోదీ ట్వీట్
పర్యాటకుల వాహనం ప్రమాదానికి గురికావడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు సూచించారు. గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
యూపీలో ఓ భర్త పట్ల భార్య కిరాతకంగా వ్యవహరించింది. సిగరెట్లతో వాతలు పెడుతూ భర్తకు నరకం చూపింది. -
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. -
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ