ఆహారం ముట్టుకున్నాడని దారుణ హత్య

ఉన్నత వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ దళితుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. వేడుకలో ఆహారాన్ని ముట్టుకున్నాడని యువకుడిని కొట్టి చంపారు....

Updated : 09 Dec 2020 15:37 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కులసర్పం బుసలు కొడుతోంది.  అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ దళితుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. వేడుకలో ఆహారాన్ని ముట్టుకున్నాడని యువకుడిని కొట్టి చంపారు. ఈ కిరాతక ఘటన ఛతర్‌పుర్‌లో చోటుచేసుకుంది. ఉన్నత వర్గానికి చెందిన భూర సోని, సంతోశ్‌ పాల్‌ అనే వ్యక్తులు కిషన్‌పుర్‌ గ్రామంలో విందు నిర్వహించారు. విందు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు దేవరాజ్ అనురాగి (25) అనే దళిత యువకుడిని పిలిపించారు. అయితే శుభ్రం చేసేముందు భోజనం చేద్దామని అనురాగి ఆహారం వడ్డించుకోగా మా ఆహారాన్నే ముడతావా అంటూ భూర సోని, సంతోశ్‌ పాల్‌లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిపై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అనురాగి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఛతర్‌పుర్‌ ఎస్పీ సచిన్‌ శర్మ పేర్కొన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.

ఇవీ చదవండి...

మూడు రోజులుగా వేలాడిన మృతదేహం

రేణిగుంటలో రైలు పట్టాలపై బాంబు పేలుడు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని