ఇంకా నయం, ఎన్కౌంటర్ కాలేదు
నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను.
విడుదలైన యూపీ వైద్యుడి సంచలన వ్యాఖ్యలు
మథుర: దేశద్రోహ ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఉత్తర్ప్రదేశ్ వైద్యుడు డా.కఫీల్ ఖాన్.. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు విడుదలయ్యారు. బుధవారం అర్ధరాత్రి విడుదలైన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా ప్రసంగంలో హింస, విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుకు ధన్యవాదాలు. అలాగే నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మార్గమధ్యలోనే నన్ను ఎన్కౌంటర్ చేయకుండా జైలుకు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు.’’ అని కఫీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనను ఇంకో కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డా.కఫీల్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని బీఆర్డీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా విధులు నిర్వహించేవారు. ఆగస్టు 2017న ఆక్సిజన్ అందకపోవటంతో 60 మంది శిశువులు మృతిచెందిన ఘటనలో... విధినిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఈయనను సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు తొమ్మిది నెలల పాటు జైలులో ఉన్న అనంతరం నిర్దోషిగా విడుదలయ్యారు.
కఫీల్ ఖాన్ జనవరి 29నాటి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని.. ఆయనపై దేశ ద్రోహం అభియోగాలు మోపుతూ జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాటి ప్రసంగంలో హింస, విద్వేషపూరిత అంశాలేవీ లేవని అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్లోని మథుర కారాగారం నుంచి బుధవారం అర్ధరాత్రి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కఫీల్ ఖాన్ మాట్లాడుతూ తనను ప్రభుత్వ విధుల్లో చేరేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్