Hyderabad: సైబరాబాద్‌లో మందుబాబు వీరంగం, ఒకరు మృతి

మద్యం తాగి వాహనం నడుపుతూ కనిపించిన ప్రతీ వాహనాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. 

Published : 15 Apr 2024 23:07 IST

హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడుపుతూ కనిపించిన కనిపించిన ప్రతీ వాహనాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. నిజాంపేటకు చెందిన క్రాంతి కుమార్ యాదవ్ సోమవారం సాయంత్రం  సైబరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టాడు. నిందితుడిని వాహనదారులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో 550గా రీడింగ్ నమోదైంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని