కడపలో రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం

కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో-లారీ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్‌ సజీవదహనమయ్యారు. పలువురికి...

Updated : 13 Mar 2020 11:58 IST

సిద్దవటం: కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో-లారీ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్‌ బండి ఆది సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి.బాధితులు కర్నూలు జిల్లా బాలంపురం నుంచి స్కార్పియోలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను సుల్తాన్‌ (28), హరినాథ్‌రెడ్డి(36), నందకిశోర్‌రెడ్డి(6), పార్వతి(30), శంకర్‌నారాయణరెడ్డి(55), జయమ్మ(55), కృష్ణ కిశోర్‌రెడ్డి (29)గా గుర్తించారు. వీరితోపాటు మరో బాలిక సైతం గాయపడినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని