Crime News: పులిచర్మం అమ్మేందుకు యత్నించిన ఐదుగురి అరెస్టు
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైజంక్షన్ వద్ద పులిచర్మం అమ్మడానికి ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పులిచర్మం, మూడు సెల్ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలను
పులిచర్మాన్ని పరిశీలిస్తున్న ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్, డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, ఇతర అధికారులు
ములుగు, న్యూస్టుడే: ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైజంక్షన్ వద్ద పులిచర్మం అమ్మడానికి ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పులిచర్మం, మూడు సెల్ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్, జిల్లా అటవీ అధికారి ప్రదీప్కుమార్శెట్టి పోలీస్ హెడ్క్వార్టర్స్లో వివరాలు వెల్లడించారు. సమాచారం మేరకు జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. జగన్నాథపురం వై జంక్షన్ వద్ద ఉదయం ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వివరాలు రాబట్టారు. వారి వద్ద ఉన్న సంచిలో పులిచర్మం ఉన్నట్లు గుర్తించారు. దూలాపురం అటవీ అధికారులతో పంచనామా నిర్వహించగా, నిజమైన పులిచర్మం అని తేలింది. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు నిందితులు తెలిపారు. వెంకటాపురం మండలం కొండాపురంలో డ్రైవర్గా పనిచేస్తున్న పూనెం విఘ్నేష్ (23), సెంట్రింగ్ వర్కర్ సోయం రమేష్ (37), ఏటూరునాగారం మండలం గోవుపల్లి గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ చిరా శ్రీను(32), టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చింతల బాలకృష్ణ (25), కూలి పనులు చేసే సోది చంటి (23) నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. పెద్దపులికి సంబంధించిన పూర్తి వివరాలేవీ తెలియలేదని, దర్యాప్తు చేపట్టి త్వరలో చెబుతామని జిల్లా అటవీఅధికారి అన్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్కుమార్, వెంకటాపురం సీఐ కె.శివప్రసాద్, ఎస్సైలు జి.తిరుపతి, కె.తిరుపతిరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..