ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

పొలం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.

Updated : 29 Jun 2022 12:57 IST

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: పొలం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం... తంగళ్లపల్లి మండలం బాలమల్లుపల్లె గ్రామానికి చెందిన అలువాల దేవయ్య- ఎల్లవ్వ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అలువాల ప్రసాద్‌ (26) ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లి అక్కడే డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రితం స్వగ్రామమైన బాలమల్లుపల్లెకు వచ్చి ఇంటి వద్దనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలం వద్దకు వెళ్లిన ప్రసాద్‌ అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పనులు చేస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రసాద్‌ను చూసి దేవయ్యకు చెప్పాడు. వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ప్రసాద్‌ చనిపోయే ముందు తన ఫోన్‌లోని స్టేటస్‌లో సో సారీ టు ఆల్‌ అని పెట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు