Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
సాఫ్ట్వేర్ ఇంజినీరు నారాయణరెడ్డి హత్యకు మామ కందుల వెంకటేశ్వర్రెడ్డి ఇచ్చిన సుపారీ రూ.4.50 లక్షలని తెలిసింది. ఒకే సామాజిక వర్గం అయినా తన కుమార్తెను నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని భరించలేక సుపారీ ఇచ్చి
పోలీసుల అదుపులో అనుమానితులు!
ఈనాడు హైదరాబాద్, కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: సాఫ్ట్వేర్ ఇంజినీరు నారాయణరెడ్డి హత్యకు మామ కందుల వెంకటేశ్వర్రెడ్డి ఇచ్చిన సుపారీ రూ.4.50 లక్షలని తెలిసింది. ఒకే సామాజిక వర్గం అయినా తన కుమార్తెను నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని భరించలేక సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేయించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ప్రకాశం జిల్లా రాజువారిపాలెం యువకుడు నారాయణరెడ్డి (25) హత్యలో కేపీహెచ్బీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెళ్లి చేసుకుని దిల్లీలలో తలదాచుకున్న కుమార్తె, అల్లుడికి నచ్చజెప్పి సొంతూరు తీసుకొచ్చారు. ఘనంగా వేడుక జరిపిస్తామంటూ కుమార్తెను గృహనిర్బంధం చేశారు. తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం, ఆమెకు మళ్లీ పెళ్లి చేద్దామనుకుంటే సంబంధాలను తిరస్కరిస్తుండడం వెంకటేశ్వర్రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. దీనికి కారణమైన అల్లుడు నారాయణరెడ్డి హత్యకు పథకం పన్నాడు. బంధువైన శ్రీనివాస్రెడ్డిని ఆశ్రయించగా అతను రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.50 వేలు తక్కువకు ఒప్పందం కుదిరింది.
షేక్పేటలో హత్యకు కుట్ర
శ్రీనివాస్రెడ్డి దిల్సుఖ్నగర్లో ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాడు. అతను గత నెల 24న గిద్దలూరుకు చెందిన ఆశిక్ను తీసుకొని కర్నూలు వెళ్లాడు. అక్కడ అద్దెకు తీసుకున్న కారులో మరోవ్యక్తి కాశీని ఎక్కించుకుని 25 సాయంత్రం నగరానికి వచ్చాడు. షేక్పేట సమీపంలో అద్దెకు గది తీసుకున్నారు. అక్కడే నారాయణరెడ్డి హత్యకు పథకరచన చేసినట్టు సమాచారం. జూన్ 27న నారాయణరెడ్డిని కారులో బయటకు తీసుకెళ్లి మెడకు టవల్ను ఉచ్చుగా వేసి హతమార్చారు. అదే కారులో జిన్నారం శివారు రహదారి పక్కన అటవీ ప్రాంతంలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు.
కాల్ డేటా ఆధారంగా..
ఆ తర్వాత నారాయణరెడ్డిని చంపేసినట్టు శ్రీనివాస్రెడ్డి ఫోన్ ద్వారా వెంకటేశ్వర్రెడ్డికి సమాచారం ఇచ్చాడు. కాశీ, ఆశిక్తో కలిసి శ్రీనివాస్రెడ్డి కారులో కర్నూలు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మళ్లీ వెంకటేశ్వర్రెడ్డికి ఫోన్ చేసి తనకు డబ్బు కావాలని అడిగాడు. నెల తర్వాత ఇస్తానని చెప్పడంతో ముగ్గురూ అక్కడి నుంచి విడిపోయారు. ఆశిక్ కేపీహెచ్బీ కాలనీలోని తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. శ్రీనివాసరెడ్డి, కాశీ.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. నారాయణరెడ్డి అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కాల్ డేటా ఆధారంగా కూపీ లాగటంతో ఆశిక్ చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పరువు హత్య బయటపడింది.
ఎముకలే మిగిలాయి
జిన్నారంలోని అడవిలో నారాయణరెడ్డి మృతదేహాన్ని తగులబెట్టిన ప్రదేశానికి ఈ నెల 2న రాత్రి పోలీసులు వెళ్లినప్పుడు ఎడమ కాలు దూరంగా పడి ఉంది. కేవలం ఎముకలే కనిపించాయి. శవపరీక్ష అనంతరం సంచిలో వాటిని కుటుంబసభ్యులకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. -
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన