భార్యతో గొడవ.. మూడేళ్ల కుమారుడి హత్య

భార్యతో గొడవపడిన భర్త పట్టరాని ఆవేశంతో మూడేళ్ల కుమారుడిని పలుగుతో కొట్టి హతమార్చాడు. మృతదేహాన్ని పొలానికి తీసుకెళ్లి పాతిపెట్టాడు.

Published : 27 Jan 2023 06:37 IST

యూపీలో భర్త ఘాతుకం

ఫతేపుర్‌: భార్యతో గొడవపడిన భర్త పట్టరాని ఆవేశంతో మూడేళ్ల కుమారుడిని పలుగుతో కొట్టి హతమార్చాడు. మృతదేహాన్ని పొలానికి తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుసేన్‌గంజ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని