క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

క్రికెట్‌ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 22 Mar 2023 10:25 IST

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: క్రికెట్‌ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపూర్‌ మండలలోని గొర్రెపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి విష్ణు(30) మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొంటున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన తోటి క్రీడాకారులు చికిత్స కోసం మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి తల్లి సరోజన గొర్రెపల్లి సర్పంచిగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని