బడి నుంచి ఇంటికి చేరని ఉపాధ్యాయిని.. దారుణహత్య

మేలుకోటె ఎస్‌ఈటీ పబ్లిక్‌ పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న దీపిక అనే ఉపాధ్యాయురాలు హత్యకు గురయ్యారు. యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారు.

Published : 23 Jan 2024 06:55 IST

ఉపాధ్యాయిని దీపిక

మండ్య, న్యూస్‌టుడే : మేలుకోటె ఎస్‌ఈటీ పబ్లిక్‌ పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న దీపిక అనే ఉపాధ్యాయురాలు హత్యకు గురయ్యారు. యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారు. మాణిక్యనహళ్లికి చెందిన లోకేశ్‌ ఈమె భర్త. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె- ఎంతకీ ఇంటికి చేరలేదు. ఆమె కనిపించడం లేదని లోకేశ్‌ మేలుకోటె ఠాణాలో ఫిర్యాదు చేశారని ఎస్పీ యతీశ్‌ తెలిపారు. మరణోత్తర పరీక్షల అనంతరం హత్యకు సంబంధించి మరిన్ని వివరాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని