పుల్వామా తరహాలో భారీ ఉగ్ర కుట్ర!
పుల్వామా దాడి జరిగి రెండేళ్లు పూర్తైన వేళ..ఉగ్రవాదులు మరోసారి భారీ కుట్రకు ప్రయత్నించినట్లు బయటపడింది.
భగ్నం చేసిన భద్రతా దళాలు.. నలుగురి అరెస్ట్
జమ్మూ: పుల్వామా దాడి జరిగి రెండేళ్లు పూర్తైన వేళ ఉగ్రవాదులు మరోసారి భారీ కుట్రకు యత్నించినట్లు బయటపడింది. అయితే, దీన్ని ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు ఆ కుట్రను భగ్నం చేశాయి. ఇందులో భాగంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
రెండేళ్ల క్రితం జమ్మూలోని పుల్వామా దాడి ఘటన జరిగి ఆదివారానికి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇదే రోజున జమ్మూలో మరోసారి భారీ ఉగ్రదాడికి యత్నించేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా విభాగం పసిగట్టింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా పోలీసులు గస్తీని ముమ్మరం చేయడంతోపాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా సాంబా జిల్లాలోని రఘునాథ్ మందిర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ నర్సింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఈ భారీ ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. అతడి నుంచి అత్యంత తీవ్రత కలిగిన 7 కిలోల మందుగుండు సామగ్రి (15 ఐఈడీ)లతో పాటు ఆరు పిస్టల్లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీపీ ముఖేష్ సింగ్ వెల్లడించారు.
రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా..!
అదుపులోకి తీసుకున్న నర్సింగ్ విద్యార్థిని విచారించగా, నాలుగు చోట్ల దాడి చేసేందుకు పథకం రచించినట్లు బయటపడింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన రఘునాథ్ మందిర్, బస్స్టాండ్, రైల్వే స్టేషన్, లఖ్దాతా బజార్ చోట్ల దాడులు జరిపి శ్రీనగర్కు పారిపోయేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు విచారణలో వెల్లడించాడు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఈడీలను బాంబ్ స్క్వాడ్ బృందాలు నిర్వీర్యం చేశాయి. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై జైషే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 40 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు.
ఇవీ చదవండి..
పుల్వామా దాడి..ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు
పుల్వామా దాడి మా పనే..పాక్ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM