Andhra news: ఊయలే.. ఉరి తాడైంది!

ఆ చిన్నారికి ఊయలే ఉరితాడైంది. చీర కొంగుతో వేసిన ఉయ్యాలలో ఊగుతుండగా..

Updated : 25 Sep 2022 20:25 IST

పెనుగంచిప్రోలు: ఆ చిన్నారికి ఊయలే ఉరితాడైంది. చీర కొంగుతో వేసిన ఉయ్యాలలో ఊగుతుండగా..ప్రమాద వశాత్తు అది మెడకు బిగుసుకొని ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తానూరి గోపి, తిరుపతమ్మ దంపతుల పెద్ద కుమార్తె లలితశ్రీ నవాబుపేట ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా.. చీర కొంగుతో వేసిన ఉయ్యాల్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా చీరకొంగు మెడకు బిగుసుకొని ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉన్న బంధువులు గమనించి హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని