వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి

వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.

Updated : 19 Mar 2024 11:02 IST

గిద్దలూరు: వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని తొలుత గిద్దలూరు నుంచి కర్నూలుకు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మునయ్య అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.

అక్కసుతోనే చంపేశారు: అచ్చెన్న

చిలకలూరిపేట సమీపంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకు జనాన్ని తరలించాడనే అక్కసుతో మునయ్యను వైకాపా కార్యకర్తలు చంపేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని