Suicide: భర్తకు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా బాబేనాయక్‌ తండాకు చెందిన రమ్యశ్రీకి(22) కర్ణాటక

Updated : 30 Oct 2021 07:31 IST

రమ్యశ్రీ

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా బాబేనాయక్‌ తండాకు చెందిన రమ్యశ్రీకి(22) కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన చందునాయక్‌తో వివాహమైంది. వీరికి 11 నెలల కుమార్తె ఉంది. కుటుంబ విషయమై కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో మదనపల్లెలోని ఎస్‌బీఐ కాలనీ విస్తరణ ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రమ్యశ్రీ వచ్చింది. తనను తీసుకెళ్లడం లేదని శుక్రవారం భర్తకు వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి అతను చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని రమ్యశ్రీ తల్లి కమలమ్మకు ఫోన్‌ చేసి చెప్పాడు. అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె ఉరేసుకుందని కమలమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని