ఉగ్ర ఘాతుకం.. 19 మంది మృతి!

ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ పెద్ద  విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో.........

Published : 03 Nov 2020 01:19 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇరానియన్‌ బుక్‌ ఫెయర్‌ ప్రారంభం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య గంటల తరబడి కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు గుర్తించారు. బుక్‌ ఫెయిర్‌ ప్రారంభించేందుకు కొందరు అధికారులు వస్తుండగా ఈ కాల్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. కాల్పుల సమయంలో వందలాది మంది యూనివర్సిటీ గేట్లు దూకి పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న అఫ్గన్‌ భద్రతా దళాలు రంగంలోకి దిగి యూనివర్సిటీని చుట్టుముట్టి.. రోడ్లు మూసివేసినట్టు పేర్కొన్నారు. 

కాబూల్‌ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే, కాబూల్‌లో కొన్ని విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. గత వారంలో కాబూల్‌లోని ఓ విద్యా సంస్థ వద్ద ఐసిస్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని