TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి

ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.

Updated : 30 Nov 2023 14:33 IST

ఎదులాపురం: ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78)  పోలింగ్‌ బూత్‌ దగ్గరికి వచ్చే సరికి ఫిట్స్‌  వచ్చి పడిపోయింది.  దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భుక్తాపుర్‌నకు చెందిన రాజన్న (65) అనే  వృద్ధుడు ఓటేసేందుకు వరుసలో నిల్చున్నారు.  అంతలోనే కళ్లు తిరిగిపడిపోవడంతో ఆయన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని