Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి

మన్యం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నారాయణపట్నం పరిధిలోని ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలో పడింది.

Updated : 27 Sep 2023 19:53 IST

నారాయణపట్నం: మన్యం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నారాయణపట్నం పరిధిలోని ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు జయరాజు, బాలరాజు, శివ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులను మక్కువ మండలం విజయరామాపురం వాసులుగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని