ఈత సరదా.. ఇద్దరు స్నేహితులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదా కోసం వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు..

Published : 26 Apr 2021 01:12 IST

చౌటుప్పల్‌ గ్రామీణం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదా కోసం వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన నాని అలియాస్‌ మాధవ్ (18), రోహన్‌(17) ఆదివారం తమ ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై చౌటుప్పల్‌కు వచ్చారు. సరదా కోసం ఇక్కడి లక్కారం చెరువులో ఈతకు దిగారు. అ క్రమంలో ప్రమాదవశాత్తు నాని, రోహన్‌ చెరువులో పడి మునిగిపోతుండటం గమనించిన ఇతర స్నేహితులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చి కాపాడేలోపే యువకులిద్దరూ నీటమునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ శ్రీనివాస్‌ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని