Uttarpradesh: ప్రియురాలికి పిల్లలు లేరని ప్రియుడి నిర్వాకం.. పట్టించిన సీసీ ఫుటేజ్‌

ప్రియురాలి కళ్లలో ఆనందం చూడాలనుకున్న ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు.

Published : 30 Apr 2022 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియురాలి కళ్లలో ఆనందం చూడాలనుకున్న ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. సొంత మనవరాలినే అపహరించి అరెస్టయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం బిజ్‌నౌర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగీనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన నెలరోజుల వయసున్న కూతురు కనిపించడం లేదంటూ ఏప్రిల్‌ 20న పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఉదయం లేచి చూసేసరికి తన బిడ్డ కనిపించకుండా పోయిందంటూ పేర్కొన్నాడు.

ఈ ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు పోలీసులకు దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా తన భార్య కన్న తండ్రైన మహమ్మద్‌ జాఫర్‌ (56) నిందితుడని తేలింది. బిహార్‌కు చెందిన 40 ఏళ్ల వివాహితతో జాఫర్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. తనకు పిల్లలు లేరని కలత చెందుతున్న ఆమె ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకుంది. ఆదే విషయం జాఫర్‌కు చెప్పింది. తన కూతురు నెల రోజుల క్రితమే ఓ ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ పసికందునే ప్రియురాలికి ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉండగా మనవరాలిని ఎత్తుకొచ్చాడు. ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు తాజాగా అతడిని కటకటాల్లోకి నెట్టారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని