ఏఈవో కార్యాలయాలుగా రైతువేదికలు
రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి ( ఏఈవో)
అమలునకు సర్కారు సన్నాహాలు
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి ( ఏఈవో) కార్యాలయాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రైతు వేదికలను నిర్మించి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారు రైతులకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం, యాసంగి సాగు సమయాల్లో సరైన సూచనలు అందేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
నిత్యం అందుబాటులో ఉండేలా ఆదేశాలు..
ఉమ్మడి జిల్లాలోని క్లస్టర్ల స్థాయిలో నిర్మించిన రైతువేదికలను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏఈవోలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గ్రామాల్లోని రైతు వేదికలకు చేరుకోవాలి. అనంతరం క్షేత్రస్థాయిలో పంట పొలాలకు వెళ్లాలి. మధ్యాహ్నం 3 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. సాగు సమస్యలపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలి. ఒక్కో రైతు వేదిక పరిధిలో 1500 నుంచి 5 వేల ఎకరాల వరకు విస్తీర్ణం ఉంటుంది. దీనిపై సంబంధిత ఏఈవోలు పర్యవేక్షణ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహణ ఖర్చుల కింద 9 వేలు చెల్లించనుంది. గతంలోనే కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ అందజేసింది. కనీస వసతులు కల్పించినందున కార్యాలయానికి అనుకూలంగా మార్చుకుని రైతులకు అవసరమైన రీతిలో సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా నిర్మించిన రైతువేదికలకు భద్రత కరవైంది. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారాయి. అలాంటి ప్రాంతాల్లో దినమంతా మహిళా అధికారులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. ఇలాంటి రైతువేదికలకు సరైన రక్షణ ఏర్పాట్లు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా సమాచారం అందుతుంది: కృష్ణ, మండల వ్యవసాయాధికారి, మంచిర్యాల
ఏఈవోలకు క్షేత్రస్థాయిలో రైతువేదికలను కార్యాలయాలుగా మార్చితే రైతులకు తాజా సమాచారం అందుతుంది. రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే సూచనలు, సలహాలు పొందుతారు. ఇప్పటికే ప్రతి వారంలో రెండు రోజులు రైతులకు ఏఈవోలు సాగులో మెలకువలు, ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తే రైతులను చైతన్యవంతం చేసి నకిలీ విత్తనాలు, ఎరువుల భారి నుంచి కాపాడుకోవచ్చు. పంటలకు తెగులు సోకితే సత్వరమే ఏఈవోలు స్పందించి పంటలను కాపాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
[ 05-05-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. -
భారాసతోనే రాష్ట్రానికి మేలు
[ 05-05-2024]
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. -
అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
[ 05-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. -
అగ్రనేతలపై కాంగ్రెస్.. భాజపా ఆశలు
[ 05-05-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్ రోడ్షో జరిగింది. -
దేవుడి పేరుతో భాజపా రాజకీయం
[ 05-05-2024]
దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. -
రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు
[ 05-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాఠోడ్ తేల్చిచెప్పారు. -
సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
[ 05-05-2024]
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
[ 05-05-2024]
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు -
బాల్యవివాహాలతో అనర్థాలు
[ 05-05-2024]
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడుతాయని మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణుడు నిఖిల్రెడ్డి పేర్కొన్నారు. -
కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
[ 05-05-2024]
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. -
పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
[ 05-05-2024]
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. -
ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?
[ 05-05-2024]
బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్(ఓఎస్ఏఎమ్) సభ్యులు అన్నారు. -
లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
[ 05-05-2024]
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు