నాణ్యమైన బొగ్గు.. ఆదాయం వైపు మొగ్గు
సింగరేణి బొగ్గు పరిమాణం తగ్గించి సరఫరా చేయాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఇటీవల అధికారులను ఆదేశించారు.
తక్కువ పరిమాణం.. ఎక్కువ ధర
శ్రీరాంపూర్లోని సింగరేణి సీహెచ్పీ (పాత చిత్రం)
న్యూస్టుడే, శ్రీరాంపూర్: సింగరేణి బొగ్గు పరిమాణం తగ్గించి సరఫరా చేయాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సీహెచ్పీల ద్వారా బొగ్గును వివిధ పరిమాణాలుగా చేసి, నాణ్యమైన బొగ్గు పంపిణీ చేస్తోంది. యాజమాన్యం పంపిణీ చేసే బొగ్గు వివిధ పరిమాణాల్లో ఉంటుంది. ఇందులో 100 నుంచి 250 మి.మీ. వరకు బొగ్గును వివిధ పరిశ్రమలతోపాటు థర్మల్ కేంద్రాలకు రవాణా చేస్తోంది. విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును పొడిగా మార్చి బాయిలర్లలో మండించడం ద్వారా వచ్చే ఉష్ణశక్తిని టర్బైన్లకు అందించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో అధిక మందం ఉన్న బొగ్గును పొడిగా మార్చాలంటే విద్యుత్తు కేంద్రాలకు అదనపు సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు మందాన్ని 100 మి.మీ.లకు తగ్గిస్తే, విద్యుత్తు కేంద్రాల్లో దాన్ని పొడిగా మార్చడం సులభ తరం అవుతుందనే ఉద్దేశంతో తక్కువ పరిమాణం బొగ్గు కావాలని కోరుతున్నాయి. దీనికి ప్రతిఫలంగా టన్ను బొగ్గుకు అదనంగా రూ. 17 చొప్పున చెల్లించడానికి విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు ముందుకొచ్చినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు.
80 శాతం థర్మల్ విద్యుత్తు కేంద్రాలకే..
సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 80 శాతానికి పైగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలకే సరఫరా అవుతోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి బొగ్గు వినియోగం అవుతోంది. పరిమాణం తగ్గించడం ద్వారా సింగరేణికి ఏటా అదనంగా రూ. 60 కోట్ల నుంచి రూ. వంద కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. దీనికోసం సింగరేణి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లలో వినియోగించే క్రషర్లలో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తూ, 100 మి.మీ.కన్నా తక్కువ బొగ్గును జల్లెడ పట్టేలా ఏర్పాట్లు చేయడానికి యాజమాన్యం సన్నద్ధం అవుతోంది.
సీహెచ్పీల సామర్థ్యం పెంపు
సీహెచ్పీల సామర్థ్యాన్ని 109 మిలియన్ టన్నుల నుంచి 133 టన్నులకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. 2024-25 నాటికి కొత్తగా ఏర్పాటు చేయనున్న సీహెచ్పీల్లో వీకే ఓసీ వద్ద 4.5 మిలియన్ టన్నులు, జేకే ఓసీ వద్ద 2 మి.ట., గోలేటిలో 3.5మి.ట., ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వద్ద 5 మి.ట. రవాణా సామర్థ్యంతో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించింది. 2025-26 నుంచి సీహెచ్పీలలో క్రషింగ్, రవాణా సామర్థ్యాన్ని ఏటా 23 మి.ట. చొప్పున పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం-2 ఏరియాలో 5 మి.ట., వీకే-ృ, నైనీల్లో 10 మి.ట.చొప్పున సీహెచ్పీలను విస్తరించాలని నిర్ణయించింది. మందమర్రి సీహెచ్పీతోపాటు రైల్వే సైడింగ్ కోసం యాజమాన్యం రూ. 130 కోట్లు కేటాయించనుంది. వచ్చే జులై నాటికి మందమర్రిలో పనులు పూర్తయ్యేలా యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 సీహెచ్పీల ద్వారా నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు సరఫరా చేస్తున్న యాజమాన్యం సీహెచ్పీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎక్కువ మొత్తం బొగ్గును రవాణా చేయడానికి ప్రయత్నిస్తోంది. స్పాంజ్ ఐరన్, ఫార్మా కంపెనీలకు పంపిణీ చేస్తున్న విధంగా విద్యుత్తు కర్మాగారాలకు బొగ్గు నాణ్యతను పెంచే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తూ, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు యత్నిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి