పనులు అస్తవ్యస్తం.. సమస్యలతో సహవాసం
ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలుచేస్తోంది.
మిషన్ భగీరథ పనితీరిది
పింజారిగుట్టలో పైప్లైన్ కోసం తవ్వడంతో రహదారి దుస్థితి
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలుచేస్తోంది. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణలో అలసత్వం కారణంగా సమస్యలు తప్పటం లేదు. చేపట్టిన పనులన్నీ అస్తవ్యసంగా సాగుతుండటంతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పరిష్కారానికి ఆర్తిగా ఎదురుచూస్తున్నారు.
అంతర్గత రహదారులు ఛిద్రం..
గతంలోనే ప్రధాన పైప్లైన్ ఏర్పాటు కోసం కాలనీల్లో తవ్వకాలు చేపట్టారు. రోజులు గడిచాయి. వాటిని పూడ్చడం మర్చిపోయారు. ఆ తర్వాత ఇంటింటి కనెక్షన్ల కోసం మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ఫలితంగా చాలాచోట్ల అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో సీసీ రహదారులు లేకపోవడంతో పెద్దగా ఇబ్బందుల్లేవు. కానీ, పాత కాలనీల్లో, ఇప్పటికే రహదారుల నిర్మాణం పూర్తయిన చోట్ల చేపట్టిన తవ్వకాలు మాత్రం స్థానికులకు నరకప్రాయంగా మారుతున్నాయి. తవ్విన వాటిని సకాలంలో పూడ్చడం విస్మరించారు. వాస్తవానికి పనులు కాగానే హుటాహుటిన వాటికి ప్యాచ్వర్క్లు చేపట్టాలి. కానీ.. ఇది చాలావరకు అమలుకావడం లేదు. ఫలితంగా తవ్వకాలు చేపట్టిన మార్గంలో రాకపోకలు సాగించేవారికి, ముఖ్యంగా ద్విచక్రవాహనదారులకు అవస్థలు నిత్యకృత్యంగా మారాయి. వాహనాలు దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి వాపోతున్నారు.
నీటి సరఫరాలోనూ ఆటంకమే..
పట్టణంలో దాదాపుగా మిషన్ భగీరథ పథకం కింద కొత్త పైప్లైన్లు వేశారు. వాటికి తోడు గతంలో ఉన్న పాత పైప్లైన్లు, అంతర్గత కనెక్షన్లు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. కొత్త కనెక్షన్లకు కొన్నిచోట్ల నీటి సరఫరా కొనసాగడం లేదు. పాత తరహాలోనే నీళ్లొస్తున్నాయి. పింజారిగుట్ట లాంటి కాస్త ఎత్తయిన ప్రదేశాల్లో నీటి పరిమాణం తక్కువగా ఉండటంతో స్థానికుల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది. కొత్త పైప్లైన్లో నీటి సరఫరా జరిగితే ఈ సమస్య తీరుతుంది. కానీ, కనెక్షన్ ప్రక్రియ పూర్తయినా నీటి సరఫరా మాత్రం ప్రారంభం కాకపోవడంతో స్థానికులను అసహనానికి గురిచేస్తోంది. కొన్నిచోట్ల మురుగుకాలువల్లోంచి వేసిన పైప్లైన్లను చూసి విస్తుపోతున్నారు. లీకేజీ ఏర్పడితే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముంటుందని, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుండేదని పేర్కొంటున్నారు.
రాంనగర్ ప్రాంతంలో అలా..
61వ జాతీయరహదారి సమీపంలో ఉన్న రాంనగర్ ప్రాంతంలో నీటి ఇబ్బందులు నిత్యకృత్యమవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పరిస్థితి మరింత దయనీయమవుతోందని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. గుట్టప్రాంతం కావడంతో నీళ్లు రావని, మిషన్ భగీరథ పథకం కింద పైప్లైన్ వేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితముండటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రధాన రహదారిపక్కనే ఉన్నా, కొన్ని నివాసాలే ఉండటంతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారి తప్పిన బాల్యం..
[ 08-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. -
విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 08-05-2024]
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఓటు వేసేదెలా?
[ 08-05-2024]
ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్తోనే పదిలం
[ 08-05-2024]
ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. -
రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం
[ 08-05-2024]
‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ -
తండ్రీకొడుకులపై పోటీ
[ 08-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకçËస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. -
ఆయన ఎన్నికల ఖర్చు రూ.500
[ 08-05-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. -
సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు
[ 08-05-2024]
సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. -
రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
[ 08-05-2024]
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. -
పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
[ 08-05-2024]
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. -
భారీ వర్షం.. కాస్త ఉపశమనం!
[ 08-05-2024]
తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
విరమణపై పెదవి విరుపు
[ 08-05-2024]
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. -
ఎండ మాయం.. వానతో అపారనష్టం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. -
సామాజిక సమీక‘రణం’
[ 08-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. -
శిశువులపై చిన్నచూపు..
[ 08-05-2024]
ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. -
మెజార్టీయే లక్ష్యం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. -
ఏటా ఇదే తంతు..
[ 08-05-2024]
కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి. -
మాయ లేడి
[ 08-05-2024]
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్