కూలీల చేతుల్లో పల్లెల అభివృద్ధి
జాతీయ ఉపాధిహామీ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులను తీసుకు వస్తున్నారు. కష్టపడి పనిచేసే కూలీలకే ఇక నుంచి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
పొక్కూరులో ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు
చెన్నూరు గ్రామీణం, న్యూస్టుడే: జాతీయ ఉపాధిహామీ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులను తీసుకు వస్తున్నారు. కష్టపడి పనిచేసే కూలీలకే ఇక నుంచి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నామమాత్రంగా పనులు చేసి హాజరు వేయించుకుందామనుకుంటే ఇక కుదరదు. ప్రభుత్వం దినసరి కూలి పెంచడంతో మొత్తం కూలీ దక్కించుకునేలా అధికారులు కూలీలకు ప్రోత్సహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులు క్రియాశీలక కూలీల జాబితాను ఇదివరకే సిద్ధం చేసుకున్నారు. కొంతకాలంగా అసలే పనులకు హాజరుకాని కూలీల జాబ్కార్డులను గతంలో రద్దు చేశారు. జాబ్కార్డుల్లో యాక్టివ్, ఇన్యాక్టివ్ కూలీల జాబితాలను వేర్వేరుగా తయారు చేశారు. ఇన్యాక్టివ్ కూలీలను యాక్టివ్ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధిహామీ పథకంలో కూలీల చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులను 60-40 ప్రకారం కేటాయిస్తారు. కూలీలకు చెల్లించే నిధుల ఆధారంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కేంద్రం నుంచి మంజూరవుతాయి. వాటితోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు ఉపాధిహామీ పథకం ద్వారానే నిధులు మంజూరవుతున్నాయి. కూలీలకు ఎంత ఎక్కువ చెల్లింపులు జరిగితే అంతే ఎక్కువ మొత్తంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదలవుతాయి. ఉదాహరణకు ఒక కూలీ ఒక రోజు ఉపాధిహామీ పని చేసి రూ.100 సంపాదిస్తే అతడికి రావాల్సిన మిగతా రూ.200 రద్దవుతాయి. ఫలితంగా దీనికి సంబంధించిన 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కూడా మంజూరు కావు. ఇందుకోసమే అధికారులు క్రియాశీల కూలీల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కూలీలందరూ పనులకు వచ్చేలా, దినసరి కూలీ దక్కించుకునేలా చర్యలు చేపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు చేపట్టిన చెల్లింపులు ఆధారంగా జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.31.79 కోట్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లాలోని 16 మండలాలకు కేటాయించి పంచాయతీ భవనాలు, సీసీరహదారులను నిర్మించారు.
సంఖ్య పెరిగే అవకాశం..
జిల్లావ్యాప్తంగా ఉన్న కార్డుల్లో గతేడాది 1,827లకుపైగా జాబ్కార్డులను రద్దు చేశారు. 6,950 కూలీలను కూడా జాబితా నుంచి తొలగించారు. కూలీలకు చెల్లింపులు సక్రమంగా అందేలా బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలను సేకరించి నమోదు చేశారు. యాసంగి సీజన్ పంటల సాగు తుదిదశకు చేరుకుంది. దీంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నుంచి ఎక్కువగా కూలీలకు పనులకు వచ్చేలా క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఉదయం వేళల్లో కూలీలు పనులకు వచ్చేలా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
కూలీల గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు
కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల
జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పనులకు వచ్చే కూలీలకు గిట్టుబాటు కూలి వచ్చేలా కృషి చేస్తున్నాం. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.