బాధలు చెప్పుకొనేదెలా?
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు.
మంచిర్యాల మహిళా ఠాణాకు అధికారి కరవు..
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే: జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. ఫిబ్రవరి 29న ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. తర్వాత ఎస్సై స్థాయి అధికారి విజయ్ సైతం గతనెల 9న బదిలీ అయ్యారు. వీరి స్థానంలో ఇప్పటికీ సీఐ, ఎస్సై స్థాయి అధికారులెవరూ నియామకం కాలేదు. ఏఎస్సై స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉండడంతో ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు. కేసుల నిర్ణయాధికారం తమ చేతుల్లో లేకపోవడంతో సిబ్బంది ఫిర్యాదులు తీసుకోవడానికే పరిమితం అవుతున్నారు.
పురుషులదే పెత్తనం..
సమాజంలో రోజురోజుకూ మహిళలకు రక్షణ కరవవుతోంది. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు స్టేషన్కు వెళ్లి చెప్పుకోవాలని అనుకునే వారు చాలా అరుదు. అక్కడి దాకా వెళ్లినా మహిళా సిబ్బంది లేకపోవడం.. ఉన్నవారు పురుషులే కావటం వారి ముందు తమ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మి వెళ్లిన మహిళలను అధికారులే వేధింపులకు గురిచేసిన ఘటనలు లేకపోలేదు. మహిళా పోలీస్స్టేషన్లో ఇప్పటి వరకు పదిమంది అధికారులు పురుషులు విధులు చేపట్టగా ఇద్దరు ఏఎస్సై స్థాయి మహిళా అధికారులు ఎస్హెచ్వోగా బాధ్యతలు చేపట్టారు. ఎస్సై స్థాయి మహిళా అధికారులను నియమిస్తే మహిళలు నిర్భయంగా తమ సమస్యలను చెప్పుకునే వీలు ఉంటుంది. ఉన్నతస్థాయి అధికారులు మహిళలకు సంబంధించిన పోలీస్స్టేషన్లో మహిళా సిబ్బంది అధికంగా ఉండేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బంది ఇలా..
మహిళా ఠాణాలో మొత్తం 30 మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా ప్రస్తుతం 20 మందితో సరిపెడుతున్నారు. ఒక ఎస్సై, మరో ఏఎస్సై మహిళలు ఇక్కడ పోస్టింగ్ఉన్నా ఇతర ప్రాంతాల్లో అటాచ్డ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం నలుగురు మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్లో అందుబాటులో ఉన్నారు. సీఐ పోస్టుతోపాటు ఇద్దరు ఎస్సై పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. మూడు ఏఎస్సై పోస్టులు ఉండగా ఇద్దరు(పురుషులు), హెడ్కానిస్టేబుళ్లు ఆరుగురు, కానిస్టేబుళ్లు అయిదుగురు పురుషులే ఉన్నారు.
నియామకంలో నిర్లక్ష్యం..
సామాన్యంగా పోలీస్ష్టేషన్లలో ఓ అధికారి బదిలీ అయితే మరుసటి రెండు మూడు రోజుల్లోనే మరో అధికారిని నియమిస్తారు. మహిళల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు చేతల్లో మాత్రం వారిపట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. అధికారులు లేక యభైరోజులు చేరువవుతున్నా..కొత్తవారు ఎవరు రాకపోవడంతో ఆ శాఖ తీరుపై ఫిర్యాదుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
శ్రీనివాస్, రామగుండం పోలీసు కమిషనర్
మంచిర్యాల మహిళా పోలీస్స్టేషన్కు అధికారులను నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నియామకం ఉంటుంది. ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
-
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668