ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది.
గజ్జిగూడ వాగు వద్ద ట్రాక్టరులో ఇసుక నింపుతున్న కూలీ
కాగజ్నగర్గ్రామీణం, న్యూస్టుడే: రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి, భట్టుపల్లి, బారెగూడ పెద్దవాగు నుంచి ఇసుక విచ్చలవిడిగా రవాణా అవుతోంది. స్థానిక కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేకుండా ఇసుక తరలించుకుని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
బారెగూడ పెద్దవాగులో రాత్రివేళల్లో పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టి వాగుకు సమీపంలోని రహస్య ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారు. 50నుంచి 60ట్రాక్టర్ల ఇసుకను నిల్వచేసి కాగజ్నగర్కు చెందిన పలువురు అక్రమార్కులు రాత్రివేళ లారీల్లో ఇసుకను హైదరాబాదుకు తరలిస్తున్నట్లు సమాచారం.
భాగ్యనగర్లో ఒక్క లారీ ఇసుక ధర రూ.70 వేల నుంచి 80 వేలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే తప్ప ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేదీ బహిరంగ రహస్యమే. ఇసుక అక్రమ రవాణాలో స్థానిక నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు సైతం వీరిని పట్టుకునేందుకు సాహసించడం లేదు. కొందరు ఇసుక ట్రాక్టర్ల యజమానులు అభివృద్ధి పనులపేరిట రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొంది ప్రైవేట్లో విక్రయించుకుంటున్నారు. అనుమతులు పొందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాస్తవంగా అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తున్నారా? ఇది ప్రైవేటుకు వెళ్తుందా అనే విషయంలో రెవెన్యూ అధికారులు ఏ ఒక్కనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.
కాగజ్నగర్ మండలంలో 10 వరకు సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాలున్నాయి. అందవెల్లి సమీప పెద్దవాగు, రాస్పెల్లి, సార్సాల, గజ్టిగూడ వాగుల నుంచి ఇటుకల తయారీ కేంద్రాలకు ఇసుక రవాణా అవుతుంది. ఈ కేంద్రాల నిర్వాహకులు నయా పైసా రాయల్టీ కట్టిన దాఖలాలు లేవు.
ధ్వంసం అవుతున్న రోడ్లు..
అందవెల్లి, భట్టుపల్లి సమీపంలో పెద్దవాగు ఇసుకను కాగజ్నగర్ పట్టణానికి తరలించాలంటే రైల్వేగేటు కాలనీ, కాపువాడ మీదుగా వెళ్లాలి. తరచూ ఎక్కువ లోడ్తో ఉన్న వాహనాలు వెళ్తుండటంతో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని స్థానికులు ఇటీవల ఇసుక ట్రాక్టర్లను సైతం అడ్డుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ‘న్యూస్టుడే’ తహసీల్దార్ కిరణ్కుమార్ను సంప్రదించగా తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడ సామాగ్రి అందజేత
[ 02-05-2024]
ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేశారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు
[ 02-05-2024]
వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించినా, సమయపాలన పాటించకున్నా కఠిన చర్యలు తప్పవని అదనపు డీఎంహెచ్ఓ(కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ) డాక్టర్ గజానన్ హెచ్చరించారు. -
భాజపాకు ఓటు వేస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారు: సీఎం రేవంత్రెడ్డి
[ 02-05-2024]
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
జొన్న పంట దగ్ధం
[ 02-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం పున్నాగ గ్రామానికి చెందిన గట్టు గంగయ్య జొన్న పంట దగ్ధమైంది. -
భాజపాను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తాం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ ప్రకటించారు. -
శుక్రవారం సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం
[ 02-05-2024]
జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సెంట్రల్ గార్డెన్ లో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం ఉంటుందని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలి
[ 02-05-2024]
లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. -
రాంనగర్ యువకుడికి పీహెచ్డీ పట్టా
[ 02-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం మారుమూల పల్లె రాంనగర్ చెందిన యువకుడు చంద్రకాంత్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. -
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు స్థానిక టీఎన్జీవో భవనంలో ఆరోగ్య పరీక్షలను ... -
సీపీఎం పార్లమెంట్ స్థాయి సమావేశం జయప్రదం చేయండి
[ 02-05-2024]
సీపీఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం 3న స్థానిక యాదవ సంఘ భవనంలో నిర్బహించనున్నట్లు ... -
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి