logo

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్టు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండలాల పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్టు చేసినట్లు పాడేరు సీఐ సుధాకర్‌ తెలిపారు.

Published : 03 Dec 2022 00:58 IST

స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలతో పోలీసులు

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండలాల పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్టు చేసినట్లు పాడేరు సీఐ సుధాకర్‌ తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం దగుడుపల్లికి చెందిన ముగ్గురు పాడేరు, జి.మాడుగుల, పెదబయలు పరిధిలో రాత్రి వేళల్లో బయట నిలిపి ఉంచిన వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరిపై నిఘా పెట్టి శుక్రవారం అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎస్సై లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని