ఆర్బీకే సిబ్బంది నిర్లక్ష్యం
పెడన మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆర్బీకేల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగుల నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ లక్ష్యాలను నీరుగారుస్తోంది. దీనిపై మండల ఏవీ ఇటీవల ఎమ్మెల్యే జోగి రమేష్ను కలిసి పరిస్థితిని ఆయన
లక్ష్య సాధనలో వెనుకంజ
న్యూస్టుడే - పెడన
పెడన మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆర్బీకేల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగుల నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ లక్ష్యాలను నీరుగారుస్తోంది. దీనిపై మండల ఏవీ ఇటీవల ఎమ్మెల్యే జోగి రమేష్ను కలిసి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పెడన మండలంలో 17 గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 17 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. ఇటీవల పెడన పట్టణానికి కూడా ఆర్బీకేను మంజూరు చేయటంతో ఆ సంఖ్య 18కు చేరింది. పెడన, చేవేండ్ర, నందమూరు, చెన్నూరు, కొంకేపూడి ఆర్బీకేల్లో ఎంపీఈవోలు, మిగిలిన వాటిలో వీఏఏలు ఇన్ఛార్జులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకర్లమూడి, ఉరివి ఆర్బీకేల వీఏఏలు ఉద్యోగాలను వీడి వెళ్లటంతో ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం పలు బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా ఈక్రాప్ నమోదు, పంట నష్టం నమోదు, ధాన్యం కొనుగోళ్లు, ఈకేవైసీ తదితర బాధ్యతలను సచివాలయ పరిధిలో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు పెడన మండలంలో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి పంటను రైతులు నష్టపోయారు. ఆర్బీకేల్లో వారు అందుబాటులో లేకపోవటం, రైతులు వెళ్లినా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఈకేవైసీని వంద శాతం పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా ఈ మండలంలో సాధ్యం కాలేదు. 10,500 మంది రైతులకుగాను 8800 మంది మాత్రమే ఈప్రక్రియను పూర్తిచేశారు. ఖరీఫ్ పంట దిగుబడులు వస్తున్నా.. ఈకేవైసీ పూర్తికాకపోవటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీల్లేని పరిస్థితి తలెత్తింది. తప్పనిసరి పరిస్థితుల్లో కమిషన్ ఏజెంట్లకు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమందికి ఈ క్రాప్ నమోదును కూడా పూర్తి చేయించలేకపోయారు. ఆర్బీకేలకు వెళితే సమాధానం చెప్పేందుకు కూడా సిబ్బంది ఆసక్తి చూపడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంత మంది వీఏఏలు నామమాత్రంగా విధులకు హాజరై వెళ్లిపోతున్నారని, మండల వ్యవసాయాధికారిని సైతం ఖాతరు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 05-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ !
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు