సామాన్యులకు సైబర్ పాఠాలు
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన శ్రీనివాస్.. 2009 బ్యాచ్ ఎస్.ఐ.గా పోలీసు శాఖలో చేరారు. గతంలో మూడేళ్ల పాటు విజయవాడ నగర సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేశారు.
యూట్యూబర్గా మారిన ఎస్సై శ్రీనివాస్
విధులు నిర్వహిస్తూనే వీడియోలు అప్లోడ్
పోలీసు ఉద్యోగం చేస్తూ అందరిలా దానికే పరిమితం కాలేదు.. అంతకుమించి ఆలోచించారు ఎస్.ఐ శ్రీనివాస్. కమిషనరేట్లోని ఐటీ సెల్లో పనిచేస్తున్న ఆయన.. అటు విధి నిర్వహణలో ఊపిరిసలపకుండా ఉంటూనే సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పనకు కృషి చేస్తున్నారు. దీని కోసం యూట్యూబర్ అవతారమెత్తారు. ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన ఛానల్ ద్వారా వివరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా బయటపడాలో చెబుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
ఈనాడు - అమరావతి
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన శ్రీనివాస్.. 2009 బ్యాచ్ ఎస్.ఐ.గా పోలీసు శాఖలో చేరారు. గతంలో మూడేళ్ల పాటు విజయవాడ నగర సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో ఎందరో అమాయకులు ఈ తరహా మోసాలకు గురవుతుండటం చూశారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించే కొద్దీ అంతకంటే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తీరు ఆయనను ఆందోళనకు గురిచేసింది. తర్వాత వేరే స్టేషన్కు బదిలీ అయినా మోసపోయిన వారు పెద్ద సంఖ్యలో తనకు ఫోన్ చేసి సలహాలు అడుగుతుండేవారు. ఈ మథనంలో నుంచి పుట్టిందే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా అవగాహన కల్పించడం. తనకున్న అనుభవంతో ప్రజలను అప్రమత్తం చేస్తే కొంతమందికైనా మేలు జరుగుతుందని భావించారు. అందుకు యూట్యూబ్ను వేదికగా ఎంచుకున్నారు. తన బ్యాచ్మేట్ స్ఫూర్తితో గత ఏడాది మే నెలలో ‘సైబర్ అవేర్నెస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 35 వీడియోలు రూపొందించారు.
అందరికీ అర్థమయ్యేలా..
ఆధార్ కార్డు, కేవైసీ అప్డేట్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతోనే నేరగాళ్లు వల వేస్తుంటారు. వాటినే అంశాలుగా ఎంచుకుని వీడియోలు చేసి అప్లోడ్ చేసేవారు. వాటికి మంచి ఆదరణ వస్తుండడంతో మరిన్ని వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వీటినే ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోనూ షేర్ చేసేవారు. ఇప్పటి వరకు 20వేల మందికి పైగా వీటిని వీక్షించారు. సెల్ ఫోన్ పోతే వెంటనే ఎలా స్పందించాలి? అనే అంశంతో చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. దీనిని ఎక్కువ మంది చూశారు. ఆన్లైన్ మోసానికి గురైతే ఎలా ఫిర్యాదు చేయాలి? దొంగిలించిన ఫోన్ను తిరిగి ఎలా కనిపెట్టాలి?అనే వీడియోలను 5 వేల వీక్షణలకు పైగా వచ్చాయి. నకిలీ వెబ్సైట్లను గుర్తించడం, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల వంటి వాటికి మంచి స్పందన వచ్చింది. మహిళల పేరుతో వచ్చే నకిలీ వీడియో కాల్స్ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలపైనా తన ఛానెల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సులువుగా అర్థం చేసుకుని పాటించగలిగే కంటెంట్ ఇవ్వడంతో పాటు వీలైనంత తక్కువ నిడివి ఉండేలా చూసుకుంటున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు.
చదువుకున్నవారే మోసపోతున్నారు
మోసపోతున్న వారిలో విద్యాధికులు, యువతే అధికంగా ఉంటున్నారు. వారందరికీ వీటి గురించిన అవగాహన కల్పించడమే నా లక్ష్యం. నా వీడియోలన్నీ ఈ సమస్యల మీదనే ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో మరింత మందికి చేరువ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..