జడ్పీ స్థలాలపై కన్ను!
‘సర్.. అది జిల్లా పరిషత్తు స్థలం. అక్కడ వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్ణయించాం. పక్కన ఉన్న భవనాలను తొలగించాం. సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఖాళీ చేస్తే.. దాన్ని కూల్చి వేసి భవన సముదాయం నిర్మాణం చేస్తాం.
జేసీ బంగ్లా ఖాళీ చేయించాలని ఒత్తిడి
వాణిజ్య సముదాయం నిర్మాణానికి ప్రతిపాదన
బందరు రోడ్డులో కూల్చిన భవనాలు
ఈనాడు, అమరావతి: ‘సర్.. అది జిల్లా పరిషత్తు స్థలం. అక్కడ వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్ణయించాం. పక్కన ఉన్న భవనాలను తొలగించాం. సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఖాళీ చేస్తే.. దాన్ని కూల్చి వేసి భవన సముదాయం నిర్మాణం చేస్తాం. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మంత్రి కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నారు’ ఇదీ.. ఓ వైకాపా నేత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్పై చేస్తున్న ఒత్తిడి. గడువు తీరే వరకు ఉమ్మడి జిల్లాకు ఒకే జిల్లా పరిషత్ పాలకవర్గం. ఇంకా ఆస్తుల పంపకాలు జరగలేదు. ఉద్యోగుల విభజన చేయ లేదు. విభజన జరిగితే ఏ జిల్లాలోని ఆస్తులు ఆ జిల్లాకు చెందే అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఆగితే.. తమకేంటి అనుకున్నారో.. ఏమో... బందరు రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే కార్యక్రమం చేపట్టారు నాయకులు. ఓ వాణిజ్య భవన సముదాయం నిర్మాణం చేయాలనే ప్రతిపాదనపై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఖాళీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే జడ్పీ క్యాంపు కార్యాలయాన్ని జేసీబీలతో కూలగొట్టారు. పటిష్ఠంగా ఉన్న భవనాన్ని కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. బందరు రోడ్డు ప్రాంతంలో పలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అవన్నీ ఖాళీ చేస్తే.. వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేయవచ్చు. ఇలాంటి ఆలోచన వెనుక కొంత మంది నేతల స్వలాభం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఖాళీ చేయండి..
బందరు రహదారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ నివాసం, విడిది కార్యాలయం ఉంది. దీనిని గతంలో రెవెన్యూ శాఖకు అప్పగించారు. 1965 ప్రాంతంలో ఆ భవనంలో కృష్ణా కలెక్టర్ నివాసం ఉండేవారు. తర్వాత 1980 ప్రాంతంలో కృష్ణా కలెక్టర్ నివాసం, విడిది కార్యాలయం సబ్కలెక్టర్ బంగ్లాలోకి మార్చారు. సబ్ కలెక్టర్ బంగ్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. అంత అవసరం లేదని భావించి అక్కడి కలెక్టర్ నివాసానికి కేటాయించారు. కలెక్టర్ ఉండే బంగ్లాను సంయుక్త కలెక్టర్కు కేటాయించారు. అప్పటి నుంచి ఆ భవనం నిర్వహణ భారం మొత్తం రెవెన్యూ శాఖ భరిస్తోంది. పలుమార్లు ఆధునికీకరణ, మరమ్మతులు చేశారు. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్కుమార్ ఉంటున్నారు. ఆ బంగ్లా పక్కన ఒక వైపు జడ్పీ అతిథి గృహం ఉండేది. మరోవైపు జడ్పీ ఛైర్పర్సన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు బంగ్లా నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఆ రెండింటినీ కూల్చివేశారు. పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ నివాసం ఉండే పెంకుటిల్లును పడగొట్టారు. జడ్పీ ఛైర్పర్సన్ క్యాంపు కార్యాలయం కోసం నిర్మాణం చేసిన భవనం ఇంకా గట్టిగా ఉండేది. గత పాలక వర్గంలో గద్దె అనురాధ ఛైర్పర్సన్గా ఉన్న హయాంలో ఈ భవనంలోకి రాలేదు. ఆమె నివాసం విజయవాడలోనే ఉండేది. దాన్ని అతిథి గృహంగా మార్చారు. తర్వాత జిల్లాకు ముగ్గురు సంయుక్త కలెక్టర్లను నియమించిన నేపథ్యంలో జేసీ (అభివృద్ధి) ఎల్. శివశంకర్కు ఆ భవనం కేటాయించారు. మార్పులు, చేర్పులు చేసి ఒక వార్రూం నిర్మాణం చేశారు. దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. జడ్పీ ఎన్నికల తర్వాత దానిని ఖాళీ చేయాలని ఆయనపై ఒత్తిడి చేయడంతో అతను తన కార్యాలయాన్ని లబ్బీపేట ప్రాంతంలోకి మార్చారు. ప్రస్తుతం ఈ భవనాన్ని కూల్చివేశారు. జడ్పీ అతిథిగృహంగా ఉన్న భవనాన్ని పడేశారు. ఇక మధ్యలో జేసీ బంగ్లా ఉంది. దీన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ఖాళీ చేసిన స్థలం వందల గజాల విస్తీర్ణం ఉంటుంది. జేసీ బంగ్లా కూడా ఖాళీ చేస్తే.. మూడు స్థలాల్లో కలిపి భారీ వాణిజ్య సముదాయం నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాణం చేసిన తరహాలో నిర్మాణం చేయాలనేది ఆలోచన. దీంతో కలెక్టర్పై ఒత్తిడి వస్తోంది. గతంలో జేసీ మాధవీలత ఉన్న హయాంలో కూడా ఒత్తిడి చేస్తే.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ స్థలం రెవెన్యూ శాఖకు, పంచాయతీ రాజ్ శాఖ అప్పగించిందని ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందుతుందని వాదించారు. మాధవీలత కలెక్టర్గా ఉద్యోగోన్నతిపై వెళ్లిన తర్వాత మళ్లీ ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందరు సాక్షిగా జగన్ అబద్ధాలు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. -
జగన్ నిర్వాకం.. యువశక్తి నిర్వీర్యం
[ 07-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
ఓటుకు రేటు..!
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు. -
వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. -
నగరంలో రెడ్ జోన్ అమలు
[ 07-05-2024]
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్జోన్ (నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. -
నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని
[ 07-05-2024]
గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. -
వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
[ 07-05-2024]
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. -
ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
[ 07-05-2024]
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. -
మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
[ 07-05-2024]
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. -
రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్
[ 07-05-2024]
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కుమారుడు వెంకట్, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో రోడ్షో నిర్వహించారు. -
నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
[ 07-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
[ 07-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. -
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్ బ్యాలట్ సదుపాయం
[ 07-05-2024]
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్