చెప్పేదొకటి.. చేసేదొకటా
మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిని వైద్యకళాశాలకు అనుసంధానిస్తూ బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలను
ప్రశ్నిస్తున్న జిల్లా ఆసుపత్రి ఉద్యోగులు
ప్రారంభమైన బదిలీల కౌన్సెలింగ్
ఆసుపత్రిలో నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిని వైద్యకళాశాలకు అనుసంధానిస్తూ బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించిన నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి తమ సమస్యలను విన్నవించారు. అయినా ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మంగళవారం నుంచి వైద్యుల కౌన్సెలింగ్ కూడా ప్రారంభం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. వారి పని వారు చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కసరత్తు వేగవంతం
జిల్లాఆసుపత్రికి బోధనాసుపత్రిగా వర్గోన్నతి కల్పించడంతో పాటు ఆ స్థాయి వసతులు కల్పించేందుకు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. దీనిలో భాగంగానే ఇక్కడ ఉద్యోగులందరినీ ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసే దిశగా కసరత్తు కూడా వేగవంతమైంది. ఇక్కడ పనిచేస్తున్న రెగ్యులర్ వైద్యులు 28 మంది బదిలీ కానున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో 40మంది వైద్యులు, 100మంది వరకు స్టాఫ్ నర్సులు, 50మంది పారామెడికల్ సిబ్బంది. 15మంది నాలుగోతరగతి ఉద్యోగులు, మరో 15 మినిస్టీరియల్ స్టాఫ్ విధులు నిర్వహిస్తున్నారు. వీరు కాకుండా నేషనల్ హెల్త్మిషన్ ద్వారా పలువురు వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు. వైద్యుల కౌన్సెలింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీల జాబితా కూడా విడుదలైంది. చేసేది లేక వైద్యులు దగ్గరలో ఏయే ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్నాయో చూసుకుని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
దూర ప్రాంతంలో... తక్కువ వేతనాలతో ఎలా బతకాలి?
ఆసుపత్రిలోని ఉద్యోగులందరినీ బదిలీ చేసి బోధనాసుపత్రికి కొత్తగా పోస్టులు కేటాయిస్తామని పాలకులు చెబుతున్నారు. అయితే తమను ఇక్కడే ఉంచి కొత్తగా నియమించేవారిని ఇతర ప్రాంతాలకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి ఉద్యోగుల్లో చాలామంది అవుట్సోర్సింగ్ వారే. వాళ్లంతా నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేస్తున్నారు. అవి కూడా సక్రమంగా అందడం లేదు. ఇప్పటికీ 5నెలలకుపైగా బకాయిలు ఉన్నాయని వారు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడకు పంపిస్తారోనని ఆవేదన చెందుతున్నారు. తక్కువ వేతనాలతో ఎలా బతకాలో అని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలామంది దూర ప్రాంతాలు వెళ్లడానికి ఇష్టపడక, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారని సంఘ నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించి తమకు ఆసుపత్రిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అందరికీ ఇబ్బందే
- ఉల్లి కృష్ణ, ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ సంఘ నాయకుడు
సంఘం తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురిని కలిసి సమస్యను విన్నవించాం. న్యాయం చేస్తామని చెప్పారు. కానీ యథావిధిగా జీవోలు జారీ చేస్తున్నారు. ఇది సబబు కాదు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులందరికీ ఇబ్బందే. మళ్లీ ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం. నిర్ణయాన్ని ఉపసంహరించుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..