‘జనసేన సర్పంచిపై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు’
ఏలూరు జిల్లా కోరుకొల్లు సర్పంచి భట్టు లీలాకనకదుర్గను కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు.
సమావేశంలో నినాదాలు చేస్తున్న బండ్రెడ్డి రామకృష్ణ, లీలా ప్రసాద్,
బాలాజీ, సర్పంచి లీలా కనకదుర్గ తదితరులు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ఏలూరు జిల్లా కోరుకొల్లు సర్పంచి భట్టు లీలాకనకదుర్గను కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. కేవలం జనసేన సర్పంచి కావడంతో తన విధులు కూడా నిర్వహించనీకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకుల తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆ పార్టీ లీగల్సెల్ రాష్ట్ర నాయకులు శింగలూరి శాంతిప్రసాదు మాట్లాడుతూ ఎన్నికల్లో నామినేషన్ వేసిన దగ్గర నుంచి మహిళ అని కూడా చూడకుండా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆమె చెక్పవర్ రద్దు చేయడంతో పాటు మూడు నెలల పాటు సర్పంచి పదవి నుంచి తప్పించగా, ఈ రెండు విషయాల్లో కోర్టును ఆశ్రయించగా సర్పంచికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో పాటు ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన వారి పట్ల వ్యవహరించిన తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందన్నారు. ఎస్సీ మహిళ అయినా ఆమె పైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని, ఇలాంటి కక్షపూరిత వైఖరి సరికాదని చెప్పారు. కోరుకొల్లు సర్పంచి లీలాకనకదుర్గ మాట్లాడుతూ గ్రామసభలో తనపై దాడికి పాల్పడితే ఎస్సైకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆరోపించారు. వైకాపాలో చేరాలని ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతో వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళ్లగా తమ అధినేత పవన్కల్యాణ్ అండగా నిలిచారని, న్యాయస్థానాలను నమ్ముకునే తాను పాలన చేయగలుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ జనసేన సర్పంచిని మళ్లీ వేధింపులకు గురిచేస్తే పవన్కల్యాణ్ కారు కోరుకొల్లు వచ్చి ఆగుతుందని హెచ్చరించారు. నిబంధనలు పట్టించుకోకుండా చెక్పవర్ రద్దు చేసిన ఏలూరు జిల్లా డీపీవోని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ , వంపుగడల చౌదరి, గడ్డం రాజు, ఉరిమి సర్పంచి పంచకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.