Sai Dharam Tej: మా కుటుంబమంతా పవన్ వెంటే: సాయిధరమ్ తేజ్
‘బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్ కల్యాణ్తోనే జీవితాంతం ఉంటాం.’
‘బ్రో’ విజయోత్సవ సమావేశంలో నటుడు సాయి ధరమ్తేజ్
మాట్లాడుతున్న సాయిధరమ్తేజ్
కరెన్సీనగర్, న్యూస్టుడే: ‘బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్ కల్యాణ్తోనే జీవితాంతం ఉంటాం.’ అని నటుడు సాయి ధరమ్తేజ్ అన్నారు. పవన్, సాయితేజ్ నటించిన ‘బ్రో’ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్రబృందం మంగళవారం శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్కు వచ్చింది. ఈ సందర్భంగా సాయి ధరమ్తేజ్ విలేకర్లతో మాట్లాడుతూ మామయ్య పక్కన నటించడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. బ్రో చిత్రం కధ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక లఘు చిత్రం చేశా. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడండి. నాకు రాజకీయ అనుభవం లేదు. మా కుటుంబ సభ్యులంతా పవన్ కల్యాణ్తోనే ఉంటాం.’ అని సాయిధరమ్తేజ్ స్పష్టం చేశారు.
సినిమా దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ నటించడం కంటే దర్శకుడిగా రాణించడమే చాలా ఇష్టమన్నారు. గత 16 ఏళ్లుగా దర్శకత్వం చేస్తున్నానని, పవన్తో అందరూ సినిమాలు తీయాలనుకుంటున్నా తనకు ‘టైం’ వచ్చిందన్నారు. పవన్ కల్యాణ్తో పది నిమిషాలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. ఈ చిత్రం తీసేందుకు సాయి ధరమ్తేజ్ ఆరోగ్యం కోలుకొని త్వరగా రావాలని రెండేళ్లు ఎదురు చూశానని సముద్రఖని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
[ 28-04-2024]
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!
[ 28-04-2024]
‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. -
కూటమి విజయదుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
ఓటర్లు పెరిగారు
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. -
కరోనాలోనూ కనికరించలె..
[ 28-04-2024]
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
ఎత్తిపోతలూ ఎండగట్టారు
[ 28-04-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. -
వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
[ 28-04-2024]
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. -
భారం మోపనన్నారు.. బాదేశారు
[ 28-04-2024]
అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. -
రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం
[ 28-04-2024]
ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. -
మాటల గారడీ.. చేతల్లో బురిడీ
[ 28-04-2024]
బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. -
ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
[ 28-04-2024]
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. -
నిధులు తేలేక.. పొలంపల్లి పడక
[ 28-04-2024]
‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. -
జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
[ 28-04-2024]
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
జగన్ బాదుడు
[ 28-04-2024]
అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. -
కూటమిని గెలిపించండి
[ 28-04-2024]
పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్లను గెలిపించాలని కోరారు. -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ
[ 28-04-2024]
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్ బంగర్ శనివారం కూచిపూడి ఓరియంటల్ జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. -
వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి
[ 28-04-2024]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
[ 28-04-2024]
మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. -
ఉచిత వైద్యశిబిరం నేడు
[ 28-04-2024]
బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మంటపంలో ఆదివారం ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శనివారం తెలిపారు. -
‘పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి’
[ 28-04-2024]
వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లను వారి ఇంటివద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాటు చేయాలని...
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్