Vijayawada: చికిత్స కోసం చేరి.. పైనుంచి దూకేసి!
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరిన కంచికచర్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం రాత్రి.. రెండో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడని తెలిసింది.
యువకుడు ప్రాణాలొదిలినా స్పందించని యంత్రాంగం
కొత్తాసుపత్రిలో ఘటన.. గోప్యంగా ఉంచి పోస్టుమార్టం
ఈనాడు, అమరావతి - విజయవాడ వైద్యం, న్యూస్టుడే: విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరిన కంచికచర్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం రాత్రి.. రెండో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడని తెలిసింది. ఈ ఘటన గోప్యంగా ఉంచి పోస్టుమార్టం చేసి అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు సమాచారం. ఆసుపత్రిలో వైఫల్యాలు బయటపడతాయనే.. ఎవరికీ చెప్పకూడదని సిబ్బంది, బాధితుడి బంధువులనూ బెదిరించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కంచికచర్లకు చెందిన సురేష్(30) వారం కిందట మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అతని బంధువులు కాపాడి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు. ఆసుపత్రి బి బ్లాక్ రెండో అంతస్తులో జనరల్ మెడిసిన్కు చెందిన ఎంఎం2 వార్డులో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి బాధితుడికి తోడుగా ఉన్న అతని బంధువు టీ తాగడానికి కిందకు వెళ్లాడు. అప్పుడు వార్డులో సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడంతో సురేష్ బయటకు వచ్చి.. బిబ్లాక్ నుంచి సీబ్లాక్కు వెళ్లేందుకు మధ్యలో ఉన్న ఇనుప ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి కిందకు దూకి ప్రాణాలు వదిలాడు. ఘటన జరిగిన గంట వరకు కూడా విధుల్లో ఉండాల్సిన వైద్యులు పత్తా లేరని తెలిసింది. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకనే ఘటన జరిగిందని బాధితుడి సహాయకుడు నిలదీయగా.. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, మేమేమైనా మీ పనిమనుషులమా.? కాపలా ఉండడానికి.. అని ఒకరిద్దరు వైద్య సిబ్బంది.. తిరిగి అతడిపైనే మండిపడినట్టు తెలుస్తోంది.
రాత్రివేళ ఒక్కరూ ఉండరు...
వార్డుల్లో రాత్రివేళ రోగులను పర్యవేక్షించేందుకు ఒక్క సిబ్బంది కూడా ఉండడం లేదనే ఫిర్యాదులు చాన్నాళ్లుగా వెల్లువెత్తుతున్నాయి. కనీసం రోగులు మంచం పైనుంచి కిందకు పడిపోయినా.. పట్టించుకునే దిక్కులేదని బంధువులు మొత్తుకుంటున్నా.. పట్టించుకునే దిక్కేలేదు. వార్డుల నుంచి రోగులు ఎవరూ బయటకు రాకుండా 24గంటలూ పర్యవేక్షించేలా సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించాలి. కచ్చితంగా డ్యూటీ వైద్యుడు, ఒక స్టాఫ్నర్సు, వార్డు సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలి. కానీ.. ఒక్క వైద్య సిబ్బంది కూడా వార్డుల్లో ఉండకపోవడం వల్లే తాజా ఘటన జరిగింది. రోగుల బంధువులే ప్రతిక్షణం పక్కనుండి చూసుకోవాలి. వాళ్లు ఏమాత్రం అడుగు బయట పెట్టినా.. ఇదే పరిస్థితి. రాత్రివేళ ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైనా.. ఒక్కరు కూడా ఉండడం లేదని తరచూ రోగులు, బంధువులు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బంది ఉండటం లేదని.. ఇటీవల ఒక రోగి బంధువు జూనియర్ వైద్యుడిని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. తోపులాట వరకూ వెళ్లడంతో.. జూనియర్ వైద్యులంతా కలిసి రాత్రుళ్లు ఆందోళనకు దిగారు.
కనీసం 200మంది సిబ్బంది కావాలి..
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విజయవాడ కొత్తాసుపత్రి ఒకటి. అలాంటి ఆసుపత్రిలోనే.. అడుగడుగునా.. తీవ్ర నిర్లక్ష్యం, సౌకర్యాల కొరత తాండవిస్తోంది. మందులు, మంచాలు, స్ట్రెచర్లు, వీల్ఛైర్లు అన్నింటికీ కొరతే. ఆసుపత్రిలో పెరిగిన రోగులకు తగ్గట్టుగా కనీస స్థాయిలోనూ సిబ్బంది సంఖ్యను పెంచడం లేదు. అన్ని విభాగాల్లో కలిపి కనీసం 200 మంది ఎఫ్ఎన్వో, ఎంఎన్వో, వార్డుబోయ్, టెక్నీషియన్లు.. సహా వైద్య సిబ్బంది అవసరమని రెండేళ్ల కిందటే లెక్కలు కట్టి అప్పటి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదించారు. వెంటనే సిబ్బందిని నియమిస్తామని వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, కలెక్టర్లు చెప్పడమే తప్ప.. ఒక్కరూ మాట నిలబెట్టుకున్నది లేదు. అందుకే వార్డుల్లో సిబ్బంది కనిపించరు. చివరికి వీల్ఛైర్లు, స్ట్రెచర్లపై రోగులను బంధువులే ఆసుపత్రిలోకి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. తాజాగా ఘటనపై ఆసుపత్రి అధికారులకు బాధితుడి బంధువులు ఫిర్యాదు చేసినా గోప్యంగా ఉంచేసి.. మరుసటి రోజు పోస్టుమార్టం నిర్వహించి, వెంటనే ఊరికి తీసుకెళ్లిపోమని మృతదేహాన్ని అప్పగించినట్లు సమాచారం. ఘటనపై సూపరింటెండెంట్, అధికారులను వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించినా.. వారు స్పందించేందుకు నిరాకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ