logo

పేర్ని కిట్టూ నామినేషన్‌ దాఖలు

మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్‌ వేశారు.

Published : 24 Apr 2024 05:30 IST

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. సోమవారం ఒక సెట్‌ నామపత్రాలు దాఖలు చేసిన ఆయన మంగళవారం భారీ ర్యాలీతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి మూడు సెట్ల నామపత్రాలు అందజేశారు. ఉదయం కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పూజలు నిర్వహించిన తరువాత కోనేరుసెంటరు, బస్టాండు, లక్ష్మీటాకీస్‌ సెంటర్ల మీదగా కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), మచిలీపట్నం పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి డా.సింహాద్రి చంద్రశేఖర్‌, పార్టీకి చెందిన ముఖ్యనాయకులు, కార్పొరేషన్‌ పాలకవర్గంలో అధికారపార్టీ కార్పొరేటర్లు, గ్రామాల నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని