నవ చరితకు వంద‘నమో’
‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్ కల్యాణ్... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు.
ప్రధాని రోడ్షోకు పోటెత్తిన జనవాహిని
మోదీ, బాబు, పవన్ నినాదాలతో మార్మోగిన నగరం
ప్రచార రథంపై మోదీ అభివాదం.. పక్కనే తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్
‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్ కల్యాణ్... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు.
ముగ్గురు అగ్రనేతలను ఒకే వేదికపై చూసేందుకు మూడు పార్టీల కార్యకర్తలు తరలిరావడంతో కృష్ణా తీరాన జనకెరటం ఉవ్వెత్తున ఎగసింది. ప్రధాని మోదీ రోడ్షో కూటమి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది. అడుగడుగునా విజయభేరి మోగించారు.
మార్వాడీల ఆనంద హేళ...
ఆకర్షణీయంగా అలంకరించిన వాహనంపై మధ్యలో ప్రధాని మోదీ.. కుడివైపు తెదేపా అధినేత చంద్రబాబు, ఎడమవైపు జనసేనాని పవన్కల్యాణ్లు నిలబడ్డారు.
ముగ్గురు నేతలూ అభివాదం చేస్తుంటే.. కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది.పలు నియోజకవర్గాల నుంచి జనం తరలివచ్చారు. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా జనం గుమిగూడి మోదీకి అభివాదం చేశారు.
అభిమాన నీరాజనం
అడుగడుగునా పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు.
దాదాపు గంటసేపు ఆకర్షణీయంగా సాగిన రోడ్షోలో అగ్రనేతలు చిరునవ్వుతో.. ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ.. ఉత్సాహపరిచారు.
సకల జనుల నీరాజనాలతో నేతలు మంత్రముగ్ధులయ్యారు.
ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న కూటమి అభ్యర్థులు చిన్ని, బాలశౌరి, పెమ్మసాని. పక్కనే గద్దె రామ్మోహన్, సుజనా, సౌమ్య
రాజధాని రైతుల జేజేలు..!
ప్రధాని మోదీకి రాజధాని ప్రాంత రైతులు ఘనస్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన రైతులు రోడ్షోలో పాల్గొన్నారు. బెంజి సర్కిల్ ప్రాంతంలో వారు వేచి చూశారు. రాజధాని గురించి చంద్రబాబు ప్రధాని మోదీకి వాహనంపైనే వివరించడం కనిపించింది. పలు విషయాలను ఆయన అడుగుతూ సందేహాలు తీర్చుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం బెంజి సర్కిల్ వద్ద కొద్దిసేపు తాత్కాలిక శిబిరంలో సమావేశమైన ప్రధాని రోడ్షో విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే నగర నాయకులను పరిచయం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!