ఆహారం నాణ్యతపైనే అనుమానాలు
బుక్కరాయసముద్రం మండల పరిధిలో రోటరీపురం గ్రామం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహంలో ఆహారం కారణంగా 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జిల్లాలో సంచలనంగా మారింది.
ఎస్ఆర్ఐటీ కళాశాలలో వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు
విద్యార్థిని పరామర్శిస్తున్న తెదేపా నాయకులు
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: బుక్కరాయసముద్రం మండల పరిధిలో రోటరీపురం గ్రామం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహంలో ఆహారం కారణంగా 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జిల్లాలో సంచలనంగా మారింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి, సాంబశివారెడ్డి దంపతులకు చెందిన కళాశాలలోనే ఇలా జరగడంతో కళాశాల నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని యాజమాన్యం చెబుతున్నా విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై పలువురు ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల, ఆస్పత్రి వద్దకు వచ్చి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పిల్లలను చూసి ఆవేదన చెందారు.
వైద్యాధికారుల విచారణ
విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి, డీఐఓ యుగంధర్, డీఈవో సాయిరాం, ఫుడ్ ఇన్స్పెక్టర్ల బృందం కళాశాల వసతిగృహానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఏ కారణంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయంపై విచారణ చేపట్టారు. వసతిగృహంలో వంటగదులు, పాత్రలు, తాగునీరు, ఆహార పదార్థాలు పరిశీలించారు. మంగళవారం రాత్రి వండిన ఆహారం, తాగునీటి నమూనాలు సేకరించి పరిశీలనకు పంపారు. విద్యార్థులతో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. చాలామంది పెరుగన్నం, ఎగ్రైస్ తిన్న తర్వాతే ఇలా జరిగిందని చెప్పారని డాక్టర్లు తెలిపారు. 25 మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది కళాశాలలో ఉన్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, పర్యవేక్షిస్తున్నట్లు కొర్రపాడు డాక్టర్ శ్రీహర్ష చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు.
తెదేపా నాయకుల పరామర్శ
చికిత్స పొందుతున్న విద్యార్థులను తెదేపా నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, రామలింగారెడ్డి పరామర్శించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కళాశాలలో మెరుగైన ఆహారం, వసతులు కల్పించాలని డిమాండు చేశారు.
పరీక్షకు వంట దినుసుల నమూనాలు
అరవిందనగర్ (అనంతపురం): కలుషిత ఆహారం తిని అస్వస్థతకు లోనవటానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నామని ఆహార భద్రత, నాణ్యత అమలు శాఖ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలరు కల్యాణ చక్రవర్తి చెప్పారు. ఎగ్రైస్, టమోటారైస్, పెరుగన్నం తిన్న విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురయ్యారన్నారు. పాలను కాచి, పెరుగుతోడు వేయడానికి వాడిన వంటపాత్ర, పెరుగన్నం తినడం విద్యార్థులు ఆసుపత్రి పాలవటానికి దారి తీసిందని భావిస్తున్నామన్నారు. కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేసి వంటకు వినియోగిస్తున్న కందిపప్పు, పెసర, మినప, శెనగ పప్పు నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షకు ప్రయోగశాలకు పంపించామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్కపోతకు ఉపశమనం
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
అనంత రైతులకు జగన్ నవమోసాలు
[ 08-05-2024]
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. -
‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’
[ 08-05-2024]
గుత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
[ 08-05-2024]
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. -
నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు
[ 08-05-2024]
చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. -
అనంతపురం అర్బన్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
[ 08-05-2024]
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
కన్నుపడితే కబ్జానే
[ 08-05-2024]
రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. -
వీఆర్కు కానిస్టేబుల్
[ 08-05-2024]
కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్ శివను పోలీసు అధికారులు వీఆర్కు పంపారు. -
నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.