జగన్ వీర బాదుడు
తాను అధికారంలోకి వస్తే అన్ని పెంచుకుంటూ పోతానని ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అన్నారు. బస్సు, కరెంటు ఛార్జీలను ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు.
ఆస్తిపన్నుపై ఏటా 15 శాతం పెంపు
మూడేళ్లలో రెట్టింపు
తాను అధికారంలోకి వస్తే అన్ని పెంచుకుంటూ పోతానని ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అన్నారు. బస్సు, కరెంటు ఛార్జీలను ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు. ఆస్తి పన్ను, భూముల విలువ పెంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను వసూలు చేశారు. ఆఖరికి ఖాళీ స్థలాలపైనా పన్ను వేసి జనాల నడ్డి విరగ్గొట్టారు. పెంచుకుంటూ పోతానంటూ ఏ సంక్షేమ పథకాలో.. అభివృద్ధి పనులో అని ప్రజలు భావించారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటల్లో ఇంత అర్థం దాగి ఉందా అని పట్టణవాసులు వాపోతున్నారు.
ఈనాడు డిజిటల్, అనంతపురం -న్యూస్టుడే, అనంత నగరపాలక
గతంలో ఎప్పుడో ఒకసారి ఆస్తి పన్ను పెంచితేనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. అధికార పగ్గాల చేపట్టిన జగన్ ఆస్తి పన్ను పెంచుకుంటూ వెళ్లారు. ఏటా 15 శాతం పెంచుతూ పట్టణ వాసులపై భారం మోపారు. గతంలో పురపాలిక మొత్తానికి ఒకే విధమైన పన్ను విధించేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ విలువ బట్టి పన్ను విధిస్తున్నారు. దీనికితోడు నిర్మాణాల విలువ అమాంతం పెంచేశారు. అటు భవనాల రిజిస్ట్రేషన్ పరంగా బాదుతారు. ఇటు భవనాలు విలువ పెరిగింది కాబట్టి పన్ను పెంచేసి వసూలు చేస్తున్నారు. దీంతో యజమానులు అద్దె పెంచేస్తుండటంతో సామాన్యులకు ఇల్లు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శిస్తూ బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీసిన పెద్దమనిషి.. గద్దెనెక్కిన తర్వాత ఇంతలా బాదుతాడా... అని అనుకోలేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంత కార్పొరేషన్ కార్యాలయంలో ఆస్తి పన్ను చెల్లిస్తున్న నగర వాసులు
అనంత నగరంలో..
ఉమ్మడి జిల్లాల్లో ఏకైక నగరపాలిక అనంతపురం జనాభా 3.31 లక్షలు. పన్ను చెల్లిస్తున్న ఇళ్లు 61,829 ఉన్నాయి. ఓవైపు 15శాతం పెంచాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తూనే.. మరోవైపు వడ్డీమాఫీ అంటూ ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించారు. ఈ సంవత్సరం పాత బకాయిలు కలిపి రూ.59.98 కోట్లు డిమాండ్ ఉండగా మంగళవారం వరకు రూ.28.18 కోట్లు వసూలు అయ్యాయి. 2020-21లో రూ.24.95 కోట్లు వసూలు చేయగా.. ఈఏడాది రూ.41.58 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేళ్లలో నగర వాసుల నుంచి 16.63 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.
- అనంత నగరం భాగ్యనగర్లోని రెండున్నర సెంట్లులో ఓ ప్రైవేటు ఉద్యోగి 2010లో ఇల్లు కట్టుకున్నారు. పైఅంతస్తు లేదు. ఆస్తిపన్ను పెంచక (01.04.2021) ముందు ఆయన రూ.1100 చెల్లించేవారు.ప్రస్తుతం రూ.1880 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మరో 15 శాతం పెరుగుతుండగా అప్పటి నుంచి రూ.2107 చెల్లించాల్సి వస్తోంది. మూడేళ్లలోనే రెట్టింపు భారం పడింది. ఇలాంటి నివాసాలు నగరంలో వేలల్లోనే ఉన్నాయి.
- అనంతపురంలోని సప్తగిరి కూడలి సమీపంలో 15ఏళ్ల క్రితం నిర్మించిన దుకాణ సముదాయానికి 2021లో రూ.48,825 పన్ను చెల్లించేవారు. 2022లో రూ.53,714, 2023లో రూ.54,788, 2024లో రూ.55,884 చెల్లించాల్సి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 15 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఈమేరకు రూ.64,216 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోనే ఏకంగా 15,391 పన్ను పెరిగింది.
- హిందూపురం పట్టణ జనాభా 1.70లక్షలు. పన్ను చెల్లించే నివాసాలు 33,749 ఉన్నాయి. 2021 ముందు వరకు ఏటా రూ.5.47 కోట్ల పన్ను వసూలు చేసేవారు. ఈసారి రూ.8.55 కోట్లు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. పురవాసులపై మూడేళ్లలో రూ.3 కోట్లకు పైగా భారం మోపారు.
- కళ్యాణదుర్గం పురపాలికలో 60 వేలు మంది జనాభా ఉన్నారు. పన్ను చెల్లించే ఇళ్లు 12,015 ఉన్నాయి. 2020లో రూ.2.11 కోట్ల మేర పన్ను వసూలు చేసేవారు. 2021లో రూ.2.21 కోట్లు, 2022లో 2.26 కోట్లు, 2023లో 2.63 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.2.88 కోట్లకు పెంచారు. పురవాసుల నుంచి రూ.77 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు షాక్ మంత్రి వచ్చిన రోజునే రాజీనామా..
[ 28-04-2024]
అధికార వైకాపాకు షాక్ తగిలింది. హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పట్టణానికి వచ్చి నాయకులు, కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. -
రోడ్ల మంత్రి ప్రారంభించిన పనులకే దిక్కులేదు
[ 28-04-2024]
రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది. -
వైకాపా నాయకుడి బరితెగింపు
[ 28-04-2024]
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు. -
పంట అమ్మాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే..
[ 28-04-2024]
ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. -
వైకాపాను సాగనంపుదాం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం, కల్హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మెట్టుకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్టే : కాలవ
[ 28-04-2024]
మెట్టు గోవిందరెడ్డి తన పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం తప్పా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయనకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. -
‘రెండేళ్లలో బీటీపీకి కృష్ణాజలాలు తీసుకొస్తాం’
[ 28-04-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కాలువ పనులు పూర్తి చేసి బ్రహ్మసముద్రం మండలం, బీటీపీ జలాశయానికి గ్రావీటి ద్వారా కృష్ణా జలాలు తీసుకొస్తానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపాకు మరో అవకాశం ఇస్తే.. అరాచక పాలనే
[ 28-04-2024]
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
వైకాపా పతనానికి రోజులు దగ్గర పడ్డాయి : కేశవ్
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
జగనా.. రద్దు తగునా?
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ జాతులకు సంబంధించి పాడి ఆవులు, గేదెలు కొనుగోలు చేయడంతో పాటు మాగుడు గడ్డి, దాణామృతం తదితర పోషకాలను రాయితీతో అందించి ప్రోత్సహించారు. -
వాలంటీర్ల వద్దే సెల్ఫోన్లు
[ 28-04-2024]
గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి నుంచి సెల్ఫోన్లు, ఇతర ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. -
అవినీతిలోనూ పెద్దాయనే..
[ 28-04-2024]
అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది. -
ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరుల దోపిడీ
[ 28-04-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రకృతి వనరులను సైతం దోచుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. -
కాలం చెల్లి.. కదలనంటోన్న ప్రగతి రథచక్రం
[ 28-04-2024]
‘అనంతపురం ఆర్టీసీ బస్టాండులో ఈనెల 7న హిందూపురం డిపోకు చెందిన బస్సు 8వ ఫ్లాట్ఫాం మీదకు పరుగులు పెట్టింది. -
జగనా.. మజాకా
[ 28-04-2024]
తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్