logo

Andhra News: మేమింతే... మారమంతే

తరచూ ఎక్కడో ఒకచోట బస్సు ఆగిపోతున్నా.. ఏపీపీటీడీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనేందుకు ఆదివారం నిలిచిపోయిన బస్సు నిదర్శనం.

Updated : 21 Nov 2022 08:06 IST

చోదకుడి చాకచక్యంతో తప్పిన ప్రమాదం


టీకేఎంపురం సమీపంలో స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో ఆగిన ఆర్టీసీ బస్సు

వెదురుకుప్పం: తరచూ ఎక్కడో ఒకచోట బస్సు ఆగిపోతున్నా.. ఏపీపీటీడీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనేందుకు ఆదివారం నిలిచిపోయిన బస్సు నిదర్శనం. ఉదయం తిరుపతి నుంచి పళ్లిపట్టుకు 20 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు మార్గమధ్యలో పచ్చికాపల్లంలో ఆగడంతో ప్రయాణికులు దిగారు. మళ్లీ బయలుదేరి కార్వేటినగరం వైపు వెళుతుండగా టీకేఎంపురం దారి సమీపంలో స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో ఎడమవైపు వెళుతున్న బస్సు ఒక్కసారిగా కుడివైపునకు పోతున్నట్లు చోదకుడు గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై బస్సును నియంత్రించేలోగా ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రయాణికులు కేకలు వేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రహదారులపై గోతులు ఉండటం, కాలం చెల్లిన బస్సులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, చోదకుడు అప్రమత్తం కాకుంటే ప్రమాదం జరిగి ఉండేదని, వెంటనే మరమ్మతులు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని