అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ తన విడిది కార్యాలయం నుంచి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి మంత్రి కన్నబాబు, ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, కలె
లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి కన్నబాబు, ప్రజాప్రతినిధులు
కాకినాడ కలెక్టరేట్: జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ తన విడిది కార్యాలయం నుంచి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి మంత్రి కన్నబాబు, ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ భార్గవ్తేజ, మేయర్ శివప్రసన్న, కుడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ అల్లి రాజబాబు, అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రభుత్వం ధైర్యాన్నిచ్చిందన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ, ఈబీసీ నేస్తం పథకంలో జిల్లాలో 45-60 ఏళ్లలోపు 29,406 మంది మహిళలకు తొలి విడతగా రూ.44.10 కోట్ల ఆర్థిక సాయాన్ని ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు పేర్కొన్నారు. అనపర్తికి చెందిన కొవ్వూరి లక్ష్మి, కాకినాడకు చెందిన కోడూరి సూర్యకుమారి వర్చువల్లో సీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్పై మండిపడ్డ ముద్రగడ
[ 07-05-2024]
‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం.. -
నమో గోదారి.. తెలుగు జనఝరి
[ 07-05-2024]
వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది. -
జనగళం జయభేరి
[ 07-05-2024]
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. -
గజిబిజి.. గందరగోళం
[ 07-05-2024]
జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది. -
ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?
[ 07-05-2024]
గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. -
రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
[ 07-05-2024]
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. -
బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. -
నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 07-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. -
తీరంలో ఇసుక దొంగలు
[ 07-05-2024]
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైకాపా నాయకులు చెబితేనే జీతాలిస్తారా!
[ 07-05-2024]
రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది. -
ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..
[ 07-05-2024]
అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్. -
వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..
[ 07-05-2024]
నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 07-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. -
చంద్రన్న మాటే మాదిగలకు బాట
[ 07-05-2024]
వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్ కోరారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు. -
పెద్దాపురంలో కడప రౌడీలు
[ 07-05-2024]
ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి పోలింగ్ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా,
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!