121 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
జిల్లాలో 121 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయ్యిందని కలెక్టరు కృతికా శుక్లా పేర్కొన్నారు. పిఠాపురంలోని రెడ్డి రాజా కల్యాణ మండపంలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు.
పిఠాపురం: జిల్లాలో 121 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయ్యిందని కలెక్టరు కృతికా శుక్లా పేర్కొన్నారు. పిఠాపురంలోని రెడ్డి రాజా కల్యాణ మండపంలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేళ్ల తరువాత రీ సర్వే జరిగిందన్నారు. డ్రోన్లు, రోవర్లు వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతో భూముల విస్తీర్ణం లెక్కించామన్నారు. జిల్లాలో 80 వేల మంది రైతులకు ఈ హక్కు పత్రాలు మంజూరయ్యాయని చెప్పారు. జిల్లాలో పిఠాపురంలోని నవఖండ్రవాడలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ సర్వే ప్రారంభించి, 55 రెవెన్యూ గ్రామాలకు 48 గ్రామాల్లో సర్వే పూర్తి చేయడంతో 36 వేల మంది రైతులకు హక్కుపత్రాలు వచ్చాయన్నారు. వీటి పంపిణీకి ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టామన్నారు. జేసీ ఇలక్కియా మాట్లాడుతూ వీటిలో లోపాలు గుర్తిస్తే ఆందోళన చెందవద్దన్నారు. తహసీల్దారు, ఆర్డీవో, డీఆర్వోల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ సమగ్ర సర్వేతో రైతులకు భూ హక్కు పత్రాలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. భూముల కచ్చితత్వం తెలిపేందుకు ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చారన్నారు. మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులందరికీ ఈ పత్రాలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్సు ఏడీ లక్ష్మీనారాయణ, తహసీల్దారు వరహాలయ్య, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్, ఎంపీపీలు కన్నాబత్తుల కామేశ్వరరావు, కారే సుధ, జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు అంబేడ్కర్
అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్ కృతికాశుక్లా
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ చిరస్మరణీయుడని కలెక్టర్ కృతికాశుక్లా కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లో బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఇలక్కియ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఎస్ఎస్ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ వర్గాల అండతోనే ఉమ్మడి ప్రభుత్వ విజయం
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. -
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!