పట్టింపు లేక.. గుర్తింపు రాక
రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాలకు అక్రిడిటేషన్(గుర్తింపు) విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్) అభ్యంతరం తెలపడంపై ఇక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం)
ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కళాశాల తరగతి నిర్వహణ
రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాలకు అక్రిడిటేషన్(గుర్తింపు) విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్) అభ్యంతరం తెలపడంపై ఇక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆయా వ్యవసాయ కళాశాలల్లో ప్రమాణాల మేరకు ఐసీఏఆర్(ఐకార్) అక్రిడిటేషన్ ఇస్తుంది. ఇక్కడి వ్యవసాయ కళాశాలకు సొంత భవనాలు అందుబాటులోకి రాకపోవడం.. విద్యార్థులకు సరైన వసతి, సౌకర్యాలు లేవనే కారణాలతో ఐకార్ అక్రిడిటేషన్కు నిరాకరించినట్లు తెలుస్తోంది.
రాజమహేంద్రవరంలో ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల 2008 నవంబరులో మంజూరైంది. అప్పటి నుంచి పరాయి పంచనే కొనసాగుతోంది. తొలుత 24 మంది విద్యార్థులతో నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. తర్వాత 2009 జూన్లో నగరంలోని ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలకు తరలించి ఇక్కడి భవనంలోని పై అంతస్తులో 11 గదుల్లో వ్యవసాయ కళాశాల పరిపాలన విభాగం కార్యాలయాలు, ల్యాబ్, తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 350 మంది విద్యార్థులు నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్నారు. హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో బయట ప్రైవేటు వసతిగృహంలో విద్యార్థులు ఉండాల్సివస్తోంది.
2017లో శంకుస్థాపన చేసినా...
వ్యవసాయ కళాశాలకు నగర శివారు కాతేరు పరిధిలో 21 ఎకరాల వరకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే సొంత భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించారు. కళాశాల భవనం, విద్యార్థులకు రెండు హాస్టల్ భవనాల నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. రూ.24 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో రూ.8 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా... మిగతా రూ.16 కోట్లు నాబార్డు కేటాయించింది. నిధుల మంజూరులో జాప్యం.. ప్రభుత్వం మారడం.. కొవిడ్ వ్యాప్తి.. బిల్లుల పెండింగ్ తదితర కారణాల వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఆరేళ్ల కిందటే శంకుస్థాపన జరిగినా నేటికీ పూర్తికాలేదు. పూర్తయిన నిర్మాణాలకు ఇంకా రూ.1.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ ఉండిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏళ్లుగడుస్తున్నా సొంత భవనాలు లేకపోవడమే వల్లే కళాశాలకు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు ఐసీఏఆర్ అభ్యంతరం తెలపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గుర్తింపు లేకుంటే ఇదీ ఇబ్బంది
కళాశాలకు ఐకార్ అక్రిడిటేషన్ లేకుంటే ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజీ సీటు పొందే విషయంలో ఇబ్బందులు తప్పవు. గుర్తింపు ఇవ్వాలంటే సొంత భవనాలు, అన్ని సౌకర్యాలు ఉండి.. 75 ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉండాలి. ఈ కళాశాలకు 21 ఎకరాల వరకే సొంత క్షేత్రం ఉండగా, విమానాశ్రయం సమీపంలో 58 ఎకరాల ఆలయ భూములను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కళాశాలకు విశ్వవిద్యాలయం పేరుమీదనే ఐకార్ అక్రిడిటేషన్ పొందుతూ వచ్చారు. ఏళ్ల తరబడి సొంత భవనాలు సమకూరకపోవడంతో ఈసారి ఐసీఏఆర్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
రెండు నెలల్లో సొంత గూటికి..
విషయాన్ని కళాశాల అసోసియేట్ డీన్ శ్యామ్రాజ్నాయక్ వద్ద ప్రస్తావించగా... నిర్మాణాల పెండింగ్ బిల్లులన్నీ మంజూరు కావడంతో పనులు వేగవంతం చేశామన్నారు. రెండు నెలల వ్యవధిలోనే సొంత భవనాల్లోకి కళాశాల వెళ్లిపోతుందనీ.. నివేదికను కూడా ఐసీఏఆర్కు పంపిస్తున్నామన్నారు. అక్రిడిటేషన్ విషయంలో విశ్వవిద్యాలయం స్థాయిలోనూ చర్చిస్తున్నారనీ.. సమస్యఏమి లేదని, పీజీలో సీట్లు పొందే విషయంలో విద్యార్థులకు ఇబ్బంది ఉండదని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ వర్గాల అండతోనే ఉమ్మడి ప్రభుత్వ విజయం
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. -
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్