నిధులు దూరం.. నిర్వహణ భారం
‘అమలాపురం నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.75 వేల గ్రాంటు రావాలి. ఇప్పటివరకు 20 శాతం(రూ.15)వేలు) మాత్రమే విడుదలయ్యాయి. అవి పాఠశాల నిర్వహణకు ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు.
- న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
అల్లవరం మండలం ఓడలరేవులోని జడ్పీ ఉన్నత పాఠశాల
‘అమలాపురం నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.75 వేల గ్రాంటు రావాలి. ఇప్పటివరకు 20 శాతం(రూ.15)వేలు) మాత్రమే విడుదలయ్యాయి. అవి పాఠశాల నిర్వహణకు ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా అదనపు తరగతి గదులు, విద్యుత్తు పంకాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్తు బిల్లు అధికంగా వస్తోందని, చెల్లింపులకు ఇబ్బందికరంగా ఉంటోందని వాపోతున్నారు’.
అల్లవరం మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు గత విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు ఒక్క రూపాయి కూడా రాలేదు. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రధానోపాధ్యాయుడు ఖర్చుచేసి బిల్లులు సమర్చిస్తే.. అవి వెనక్కి తిరిగి వచ్చేశాయి. విద్యా సంవత్సరం ముగియడంతో నిధులు వెనక్కి మళ్లిపోవడమే అందుకు కారణం.
ఈ విద్యాసంవత్సరం మరో 40 రోజుల్లో ముగియవస్తున్నా.. పాఠశాలలకు కాంపోజిట్(నిర్వహణ) నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. పాఠశాలల ప్రారంభంలో నిర్వహణ నిధులను అయిదు విడతల్లో విడుదల చేస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక విడత మాత్రమే ఇచ్చారు. దీంతో పాఠశాలల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా మారింది. ఆఖరుకు సుద్దముక్కల కొనుగోలుకు కూడా గగనమవుతోందని వాపోతున్నారు. దీనికితోడు పాఠశాలల్లో నాబార్డు, నాడు-నేడు పథకంలో భాగంగా విద్యుత్తు సదుపాయం, ఇతర వసతులు సమకూర్చడంతో నిర్వహణ వ్యయం పెరిగింది.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 3,513 ప్రభుత్వ బడులున్నాయి. వీటిలో సుమారు 1,18,206 మంది చదువులు సాగిస్తున్నారు. ఈ సంవత్సరం పాఠశాల నిర్వహణ పద్దు కింద జిల్లాకు రూ.4.45 కోట్లు రావాల్సిఉండగా ఇప్పటివరకు కేవలం రూ.89 లక్షలు మాత్రమే విడుదల చేశారు. వీటితో బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, స్టేషనరీ, ప్రయోగశాల నిర్వహణ, విద్యుత్తు బిల్లులు, పరీక్షలు తదితర అవసరాల నిమిత్తం ఖర్చు చేయాల్సిఉంది. గతంలో ఈ నిధులు పాఠశాలలు ప్రారంభమైన తొలినాళ్లలోనే రెండు విడతల్లో పూర్తిస్థాయిలో ఇచ్చేవారు. కొంత ఆలస్యమైనా ఉపాధ్యాయులు ఖర్చుచేసి బిల్లు వచ్చాక తీసుకునేవారు. ప్రస్తుతం ఎనిమిది నెలల కాలంలో కేవలం 20 శాతం మాత్రమే ఇచ్చి నెలన్నర వ్యవధిలో మిగిలిన 80 శాతం మంజూరు చేయడం అనుమానమేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
కేటాయింపు ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నుంచి ఏటా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యనుబట్టి నిధులు మంజూరవుతాయి. 1 నుంచి 30 లోపు విద్యార్థులుంటే రూ.10 వేలు, 30 నుంచి 100 మందికి రూ.25 వేలు, 100 నుంచి 250 ఉంటే రూ.50 వేలు, 250 నుంచి 1000 మందికి రూ.75 వేలు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులుంటే రూ.లక్ష ఇవ్వాలి. పాఠశాల సముదాయాలకు రూ.25 వేలు, మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు విడుదల చేస్తారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
రాష్ట్రంలో ఆర్థిక లోటుతో కాసుల కష్టం వెంటాడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిధులు ఒకేసారి విడుదల చేయలేదు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యనుబట్టి జనవరిలో నిధులు విడుదలచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.25 వేలు ఇలా కేటాయించారు. ఇటీవల సమగ్ర శిక్ష నుంచి వచ్చిన నిధులను 20 శాతంలోపే సీఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేశారు.
సర్దుబాటు ఎలాగని ప్రశ్న..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సామగ్రి కొనుగోలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు బిల్లుల చెల్లింపు వంటివాటికి ఇప్పటికే ఆయా పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితి. పూర్తిస్థాయిలో విడుదలైతే తాము ఖర్చుచేసిన డబ్బులు తీసుకోవచ్చనుకున్నవారికి నిరాశే ఎదురైంది. విద్యా సంవత్సరం ముగిసేలోపు నిర్వహణ నిధులు విడుదలకాకపోతే తరువాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు ఖర్చుచేసిన ప్రధానోపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. తాము పెట్టిన డబ్బులు వస్తాయా, రావా అన్న అనుమానం వెంటాడుతోంది.
ఒక విడత మాత్రమే విడుదలయ్యాయి
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు ఇప్పటివరకు ఒక విడత మ్రాతమే విడుదలయ్యాయి. త్వరలోే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిర్వహణ నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తాం.
కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..