మొర వినరా.. మము దయగనరా.
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానికంగా పరిష్కారం దొరక్క రోజుల తరబడి స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేక.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి అనేకమంది కలెక్టరేట్కు తరలివచ్చారు.
కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానికంగా పరిష్కారం దొరక్క రోజుల తరబడి స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేక.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి అనేకమంది కలెక్టరేట్కు తరలివచ్చారు. తమ గోడు నేరుగా ఉన్నతాధికారులకు చెప్పుకొంటే న్యాయం జరుగుతుందనే ఆశతో అర్జీలు అందించారు. తన భూమిని వేరొకరి పేరున రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేశారని ఒకరు.. జగనన్న కాలనీ కోసమని ఏడాది కిందట ప్రభుత్వం తీసుకున్న తన భూమికి ఇప్పటివరకు పరిహారం అందలేదంటూ ఇంకొకరు... భూఆక్రమణలపై మరికొందరు.. పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదంటూ ఇంకొందరు.. ఉన్నతాధికారుల ఎదుట మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో మొత్తం 113 మంది అర్జీలు అందించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు, పర్యాటక ప్రాంతీయ మేనేజర్ స్వామినాయుడు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీదారుడు సంతృప్తిపడేలా వారి సమస్యలకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 400 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 31 మళ్లీ వచ్చాయన్నారు. స్పందన అర్జీల పరిష్కారం విషయంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకుండా జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు జేసీ స్పష్టం చేశారు.
పరిహారం ఇవ్వలేదు
నా పేరు టి.రాంబాబు. మాది రాజానగరం మండలం భూపాలపట్నం. జగనన్న కాలనీ కోసం గ్రామంలో సుమారు 4 ఎకరాలు రైతుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంది. దానిలో నా భూమి 16 కుంచాలు ఉంది. ఆయిల్పామ్ సాగు చేస్తూ దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తుండగా ఎకరానికి రూ.55 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. అధికారులు భూదస్త్రాలు కూడా తీసుకెళ్లారు. ఏడాది అవుతున్నా పరిహారం మాత్రం రాలేదు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి బయట మళ్లీ రూ.10 లక్షలు అప్పు తెచ్చి వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాను. భూపరిహారం డబ్బుల కోసం స్థానిక అధికారులను అడుగుతుంటే అదిగో.. ఇదిగో.. అంటున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇప్పటివరకు పడలేదు. ప్రభుత్వం పరిహారం సొమ్ము ఇవ్వకపోతే నా భూమిని తిరిగి ఇచ్చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చాను. ఇకనైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.
నా భూమిని వేరొకరి పేరున మార్చేశారు
మాది (గంగుల దుర్గారావు) దేవరపల్లి మండలం రామన్నపాలెం. 31 సెంట్ల నా భూమిని వేరొకరి పేరిట రెవెన్యూ అధికారులు మార్చేశారు. ఆ భూమికి సంబంధించి నా పేరున పాస్ పుస్తకం జారీ అయి ఆన్లైన్లో కూడా నమోదై ఉంది. నాకు తెలియకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇటీవల రెవెన్యూ దస్త్రాల్లో నా భూమిని వేరొకరి పేరుతో నమోదుచేశారు. దీనిపై అక్కడి రెవెన్యూ అధికారులను అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడంలేదు. వేరొకరితో లాలూచీ పడి రెవెన్యూ అధికారులు నాకు అన్యాయం చేస్తుండటంపై ఈ నెల 6నే కలెక్టరేట్లోని జిల్లాస్థాయి స్పందనలో అర్జీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీనిపై విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరేందుకు మళ్లీ ఇక్కడికి వచ్చాను. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్పై మండిపడ్డ ముద్రగడ
[ 07-05-2024]
‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం.. -
నమో గోదారి.. తెలుగు జనఝరి
[ 07-05-2024]
వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది. -
జనగళం జయభేరి
[ 07-05-2024]
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. -
గజిబిజి.. గందరగోళం
[ 07-05-2024]
జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది. -
ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?
[ 07-05-2024]
గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. -
రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
[ 07-05-2024]
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. -
బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. -
నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 07-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. -
తీరంలో ఇసుక దొంగలు
[ 07-05-2024]
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైకాపా నాయకులు చెబితేనే జీతాలిస్తారా!
[ 07-05-2024]
రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది. -
ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..
[ 07-05-2024]
అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్. -
వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..
[ 07-05-2024]
నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 07-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. -
చంద్రన్న మాటే మాదిగలకు బాట
[ 07-05-2024]
వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్ కోరారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు. -
పెద్దాపురంలో కడప రౌడీలు
[ 07-05-2024]
ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి పోలింగ్ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా,
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?