‘చీర అందిందా? బాగుందా? ఓటు మాకేనా?’
అంతా బాగున్నారా? చీర అందిందా? బాగున్నాయా? సంతోషమేనా.. ఓటు మాకేనా ? మర్చిపోకండి..? ఇదీ రాజమహేంద్రవరం ఎంపీ, ప్రస్తుత అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భరత్రామ్ ఇంటింటి ప్రచారం తీరు.
ఇంటింటి ప్రచారంలో ఎంపీ భరత్రామ్
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: అంతా బాగున్నారా? చీర అందిందా? బాగున్నాయా? సంతోషమేనా.. ఓటు మాకేనా ? మర్చిపోకండి..? ఇదీ రాజమహేంద్రవరం ఎంపీ, ప్రస్తుత అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భరత్రామ్ ఇంటింటి ప్రచారం తీరు. ఓటర్లను మభ్యపెట్టేలా సాగిన ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నగరంలో ఇప్పటికే 29, 32, 33, 40వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడ్ అమలులోకి రాకముందు నుంచే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే నగరంలోని ఆయా డివిజన్లలో చీరల పంపిణీ చేశారు. ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్న ఎంపీ.. మహిళా ఓటర్లను చీరలు అందాయా? అవి బాగున్నాయా? ఓటు మాకేనా? అని అడుగుతుండడం చర్చానీయాంశంగా మారింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈనెల 19న డివిజన్ పర్యటన పేరిట 32వ డివిజన్లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎంపీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసినట్లు భోగట్టా. ఇదే డివిజన్లో ఒక మహిళ.. హామీ పత్రం ఇచ్చినా ఇంటి పట్టా రాలేదని అనడంతో ఆనం కళాకేంద్రం వద్ద పట్టాలు పంపిణీ చేసినప్పుడు ఎందుకు రాలేదని ఎంపీ ప్రశ్నించారు. తన పేరు లేదని, వాలంటీరును అడిగినా ఏం చెప్పడం లేదని ఆమె అనడంలో సచివాలయానికి వెళ్లి ఎన్ని పట్టాలు ఆగిపోయాయో దగ్గరుండి చేయించాలని పార్టీ డివిజన్ ఇన్ఛార్జికి ఎంపీ సూచిస్తున్నట్లు ఆ వీడియోలో ఉండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అండ.. అక్రమ దందా
[ 29-04-2024]
అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. -
మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
[ 29-04-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. -
వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
[ 29-04-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మూగబోయిన జీవితాలు
[ 29-04-2024]
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. -
బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు
[ 29-04-2024]
బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
పిఠాపురం.. కొరకరాని కొయ్య
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. -
హోం ఓటింగ్కు 69 బృందాలు
[ 29-04-2024]
పోలింగ్ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం.. ఓట్లు దండుకుందాం
[ 29-04-2024]
అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా లేనిది ఈ ఏడాది ఇప్పుడే పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటున్నారు. గతంలో పదిమందితో కలిసి వేడుక చేసుకునే వాళ్లు ఇప్పుడు 100మందిని పిలుస్తున్నారు. అంతా ఎన్నికల మహత్యం మరి!. -
ఆంధ్రాలో మార్పు కోసమే కూటమి
[ 29-04-2024]
ఆంధ్రాలో అరాచక పాలన అంతమొందించేందుకే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలంతా ‘సిద్ధం’గా ఉన్నారని రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర
[ 29-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించనున్నారు. -
నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.