బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు
సీఎంకి వంగవీటి రాధా ప్రశ్న
మాట్లాడుతున్న వంగవీటి రాధా, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో సాయికృష్ణా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. పేదల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారన్నారు. ప్రజల మద్దతు కోరుకున్న వారే ఎప్పుడూ అధికారంలో ఉండగలరన్నారు. భయపెట్టి పాలన చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. ప్రజాసంక్షేమం చూసే వారికే ఎన్నికల్లో ఓటువేసి గెలిపించాలన్నారు. ఎంతోమంది నాయకులు పవన్కల్యాణ్ కేవలం 21 సీˆట్లు మాత్రమే తీసుకొన్నారని విమర్శిస్తున్నారని, రాజకీయాల్లో ఎన్ని సీట్లు తీసుకొన్నారని ముఖ్యం కాదని, ఆయన పిలుపు ఇస్తే ఎంతమంది కదిలి వస్తున్నారనేదే ముఖ్యమన్నారు. జగన్ ముఖ్యమా, జనం ముఖ్యమా అని ఆలోచించారు కాబట్టే పవన్కల్యాణ్ కూటమికి మద్దతిచ్చి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడితే కేసులు పెడుతున్నారని, వాళ్లకు నచ్చకపోతే వ్యాపారాలు చేయనివ్వని పరిస్థితి ఉందన్నారు. భాజపా నాయకులను గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించే బాధ్యతలు తీసుకొంటారన్నారు. రానున్న మూడు వారాలు కూటమి అభ్యర్థుల కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. వంగవీటి రంగా చెప్పినట్లు చేయిచేయి కలుపు.. చేయి జారదు గెలుపు అనే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బలానవర్గాల అభ్యున్నతికి వంగవీటి రంగా పాటుపడ్డారన్నారు. తండ్రి చూపిన బాటలో రాధా నడుస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలన్నారు. తనను స్థానికురాలు కాదని ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం అర్థం లేదన్నారు. స్థానికంగా ఎన్నికైన నేతలు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గోదావరి ప్రక్షాళనకు ఏ చర్యలు తీసుకొన్నారన్నారు. కేంద్రం గోదావరి పరిశుభ్రతకు నిధులు ఇస్తే రాష్ట్రం స్పందించడం లేదన్నారు. కేవలం రంగులు వేసి గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. సర్వేల్లో మళ్లీ మోదీ వస్తారని తేలిందన్నారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నిక కావాల్సి ఉందన్నారు. పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్