వైకాపా పాలన అంతమొందిద్దాం
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు.
తీరంలో కోత నివారించలేరు.. హార్బర్, జెట్టీలు కట్టలేరు.
అయిదేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది?
ఉప్పాడ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కొత్తపల్లి, పిఠాపురం
జాతీయ జెండాతో జనసేనాని
- ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్ తీరం.. 20వేల మంది మత్స్యకారులున్న ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ కావాలి.. రూ.422 కోట్ల బడ్జెట్.. మంత్రి సీదిరి అప్పలరాజు పనులు ప్రారంభించారు.. 30 శాతం పూర్తిచేసి ఆపేశారు.. రాళ్లతో నింపేశారు. హార్బర్ పూర్తిచేయలేదు. రాళ్లదెబ్బలకు బోట్లు పాడయ్యాయి. ఇద్దరు చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు..బాధ్యత లేదు.
- రాష్ట్రం మొత్తంమీద జన సైనికులకు చెబుతున్నా.. జనసేన బలం ఉన్నచోట కూటమి అభ్యర్థులకు ఓటు బదిలీ జరగాలి.. తెదేపా జనసేన కోసం ఎంత బలంగా నిలబడిందో వర్మ సజీవ సాక్ష్యం. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం..
కాకినాడ జిల్లా ఉప్పాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. ‘సమస్యల పరిష్కారానికి మాటిస్తున్నా. నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి గానీ మాట వెనక్కి తీసుకోను.. తప్పు జరిగితే క్షమించమంటాను. మీరు రాళ్లు విసిరినా నేను స్వీకరిస్తా’నని అన్నారు.
మీ ప్రేమ ఎంత చల్లగా ఉందో..
‘పౌర్ణమి రోజున కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందో ఆ వెన్నెలే చెబుతోంది. మీ ప్రేమామృతం మామీద, మా కూటమిపై కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు.. నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో లక్ష మంది వరకు వచ్చి నామినేషన్ రోజున మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేగా చేసి, ప్రజల మన్ననలు పొంది కూటమి ధర్మం ప్రకారం నాకోసం త్యాగం చేసిన వర్మకు కృతజ్ఞతలు’ అని పవన్ అన్నారు.
అభివృద్ధి చేయకుండా వదిలేశారు.
‘‘ప్రకృతి సంపద.. ఒకవైపు సముద్ర తీరం..ఇంకోవైపు పచ్చని పొలాలు.. మరోవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజవనరులు, కష్టపడ్డామని గుండెలమీద చెయ్యేసుకుని చెప్పే యువత.. అభివృద్ధి లేకుండా ఈ ప్రాంతం ఉండడం నాకు మనస్కరించలేదు. నాకు ఇష్టమైనవి రెండు.. వ్యవసాయం, దైవభక్తి.. అన్ని మతాలమీద గౌరవం ఉంది.. అన్ని ధర్మాలను గౌరవిస్తాను. ’ అని పేర్కొన్నారు.
కోత సమస్యకు పరిష్కారం చూపుతాం..
‘ఉప్పాడ తీరంలో వందేళ్లలో 320 ఎకరాలు కోతకు గురయ్యింది. ఉప్పెన సినిమాలో ఇల్లుకూడా కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. ఇక్కడి కోతను అరికడతాం..సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతాం’ అని పవన్ అన్నారు. సమావేశంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, భాజపా ఇన్ఛార్జి బుర్రా కృష్ణంరాజు పాల్గొన్నారు.
గురువుల గ్రామానికి ఏం సమాధానం చెబుతారు..?
‘ఈ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం ఉంది. ఇక్కడ 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇతర శాఖల్లో 50 మంది పనిచేస్తున్నారు. ఇక్కడి యువతీయువకుల కల టీచర్ కావడం.. వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంద’ని పవన్ ప్రశ్నించారు. మేము రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యపు రాశులకు నిప్పు పెట్టిన దుండగులు
[ 06-05-2024]
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం
[ 06-05-2024]
రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని, -
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు