logo

రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు.

Published : 28 Apr 2024 03:53 IST

తండ్రికి తీవ్ర గాయాలు

నల్లజర్ల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై దూబచర్ల వద్ద శనివారం జరిగిన ఘటనపై నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాలు.. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామానికి చెందిన కోమటి సురేష్‌ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన అత్తమామలు గుడిసె సిద్దమ్మ, చిట్టియ్య ఇంటికి వచ్చేశారు. ఇక్కడే ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తున్నారు. అతనికి భార్య కృష్ణవేణి, పెద్దకుమార్తె ఇందుమతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నకుమార్తె హర్షిణి.. వీళ్లే లోకం. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై చిన్న కుమార్తె హర్షిణితో వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనంపై నుంచి రహదారిపై పడిపోయిన హర్షిణి తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్‌లో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన సురేష్‌ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసినట్టు ఎస్సై వెంకటసురేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని