రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్ తీవ్రగాయాలతో బయటపడ్డారు.
తండ్రికి తీవ్ర గాయాలు
నల్లజర్ల, న్యూస్టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై దూబచర్ల వద్ద శనివారం జరిగిన ఘటనపై నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాలు.. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామానికి చెందిన కోమటి సురేష్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన అత్తమామలు గుడిసె సిద్దమ్మ, చిట్టియ్య ఇంటికి వచ్చేశారు. ఇక్కడే ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తున్నారు. అతనికి భార్య కృష్ణవేణి, పెద్దకుమార్తె ఇందుమతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నకుమార్తె హర్షిణి.. వీళ్లే లోకం. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై చిన్న కుమార్తె హర్షిణితో వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనంపై నుంచి రహదారిపై పడిపోయిన హర్షిణి తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్లో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన సురేష్ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసినట్టు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ వర్గాల అండతోనే ఉమ్మడి ప్రభుత్వ విజయం
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. -
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్