‘క్లీనింగ్ రోబో’ వచ్చేసింది
నగరపాలక సంస్థకు సరికొత్త ‘క్లీనింగ్ రోబో’ అందుబాటులోకి వచ్చింది. బాండిక్యుట్(వి.2.0).. అనిపిలిచే దీనిని ఏ తరహా మ్యాన్హోల్స్నైనా చాలా తేలిగ్గా శుభ్రం
రోబోతో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులు, ఓఎన్జీసీ సంస్థ ప్రతినిధులు
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: నగరపాలక సంస్థకు సరికొత్త ‘క్లీనింగ్ రోబో’ అందుబాటులోకి వచ్చింది. బాండిక్యుట్(వి.2.0).. అనిపిలిచే దీనిని ఏ తరహా మ్యాన్హోల్స్నైనా చాలా తేలిగ్గా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా భూగర్భ డ్రెయినేజీ మ్యాన్హోల్స్లో పేరుకుపోయిన పూడికలను తొలగించడం, వాటిని శుభ్రం చేయడం దీని ప్రత్యేకత. దీనికి అనుబంధంగా ఉండే ‘డ్రోన్ యూనిట్’కు ప్రత్యేకంగా కెమెరాలను అమర్చుతారు. వాటి సాయంతో ఈ రోబో గొట్టాల్లో మురుగునీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో ముందుస్తు అంచనా వేస్తుంది. మరోవైపు మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటిని, ఇతర ఆటంకాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఫలితంగా వాటిని సాంకేతిక సాయంతో సక్రమంగా తొలగించేందుకు సాయపడుతుంది. ఇక గొట్టాలు, మ్యాన్హోల్స్ లోపల రోజులు నిల్వ ఉండే మానవ విసర్జిత వ్యర్థాలవల్ల వెలువడే విషవాయువుల పరిమాణాలను సకాలంలో గుర్తించి వాటి ప్రమాదకర స్థితిని అంచనా వేసి, తొలగింపు విధుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. రూ.39.53 లక్షల విలువైన ఈ క్లీనింగ్ రోబోను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ కింద ఓఎన్జీసీ(ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) న్యూదిల్లీ సంస్థ.. విజయవాడ నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఉచితంగా అందజేసింది.
ప్రారంభించిన కమిషనర్
ఓఎన్జీసీ సంస్థ తమ సామాజిక బాధ్యతగా నగరపాలక సంస్థకు అందించిన మ్యాన్హోల్స్ క్లీనింగ్(రోబో) యంత్రాన్ని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్పేట వాహన డిపోలో క్లీనింగ్ రోబో తాళాన్ని స్వీకరించారు. ఉప మేయర్ శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.